సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని చాలామంది యువకులు భావిస్తుంటారు. అయితే అందరికి ఆ అవకాశం రాదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ ప్రతిష్టాత్మక పథకాన్ని ముందుకు తీసుకువచ్చింది. దీని వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయని భావించింది. ఒకటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కాక.. వారికి దేశానికి సేవ చేసే అవకాశం కూడా ఒకేసారి లభించడం. ఈ రెండు ప్రధానాంశాలుగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ అనే పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా యువకులు త్రివిద దళాల్లో చేరి.. నాలుగేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించవచ్చు. ఆ తర్వాత వారిలో 25 శాతం మందిని మాత్రమే సర్వీసుల్లో కొనసాగిస్తారు. మిగతవారిని తిరిగి పంపిచేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో అద్భుతమైనదిగా భావించినప్పటికి.. వాస్తవంగా మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బిహార్లో వరుసగా రెండోరోజూ వీధుల్లోకి వచ్చి యువకులు ఆందోళన చేశారు. రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధించారు. పట్నా-గయా, పట్నా-బక్సర్ రహదారులను నిరసనకారులు నిర్బంధించారు. జెహానాబాద్లో 83వ నంబర్ జాతీయ రహదారిని అడ్డగించారు. రోడ్డుపై టైర్లు తగులబెట్టారు. రాష్ట్రంలోని జెహానాబాద్, ఛాప్ర, నవాదా జిల్లాల్లో నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు. టీఓడీ(టూర్ ఆన్ డ్యూటీ- అగ్నిపథ్)ను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీరికి విపక్షాలు సైతం మద్దతు తెలుపుతున్నాయి. మరి కేంద్రం ప్రతిష్టత్మాకంగా తీసుకువచ్చిన ఈ పథకంపై ఇంత భారీ ఎత్తున నిరసన వ్యక్తం కావడానికి కారణాలు ఏంటి.. అసలు ఈ పథకం ఉద్దేశం వంటి తదితర పూర్తి వివరాల కోసం.. ఇది కూడా చదవండి: Karnataka: సాప్ట్ వేర్ జాబ్ వద్దనుకుని గాడిదలను పెంచుకున్నాడు.. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు! అగ్నిపథ్ పథకం.. ఈ పథకం కింద 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. పదో తరగతి లేదా ఇంటర్ పాసవ్వాలి. అర్హతలను బట్టి ఆర్మీ, వైమానిక దళం, నేవీలో పని చేయవచ్చు. వీరిని అగ్ని వీరులు అంటారు. వీరికి మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయల జీతం. రెండో ఏడాది నెలకు 33 వేల రూపాయల జీతం.. మూడో ఏడాదిలో ప్రతి నెలా 36,500 రూపాయల జీతం. నాలుగో ఏడాది నెలకు 40 వేలు జీతం లభిస్తుంది జీతంలో నుంచి ప్రతినెలా కొంత మొత్తాన్ని తీసుకుని కార్పస్ ఫండ్లో జమ చేస్తారు. అలా నాలుగేళ్లలో మొత్తం 5లక్షల రెండు వేల రూపాయలు కార్పస్ ఫండ్లో జమ అవుతాయి. దీనికి మరో 5 లక్షల 2 వేల రూపాయలు అదనంగా కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీ కలుపుకుని నాలుగేళ్ల తర్వాత 11.71 లక్షల రూపాయలు చెల్లిస్తారు. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. బీమా సౌకర్యం.. సైన్యంలో ఉండగా ఎలా చనిపోయినా 48 లక్షల జీవిత బీమా ఉంటుంది. విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అదనంగా చెల్లిస్తారు. సైన్యంలో ఉండగా శారీరక వైకల్యం సంభవిస్తే పరిహారం అందిస్తారు. వైకల్యం 100 శాతం ఉంటే 44 లక్షలు, 75 శాతమైతే 25 లక్షలు, 50 శాతమైతే 15 లక్షల రూపాయల పరిహారం ఇస్తారు. నాలుగేళ్ల తర్వాత పనితీరును సమీక్షిస్తారు. మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని రిటెయిన్ చేస్తారు. వీళ్లు సైన్యంలో 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు. నిరసనలకు కారణం... అగ్నిపథ్ పథకంపై నిరసనలు వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం.. కేవలం నాలుగేళ్లు మాత్రమే సైన్యంలో పని చేసే అవకాశం ఉండటం. నాలుగేళ్లు పూర్తియిన తర్వాత కేవలం 25 మందిని మాత్రమే సర్వీసుల్లో కొనసాగిస్తారు. మిగతా వారి పరిస్థితి ఏంటి మళ్లీ ఉద్యోగాల కోసం సిద్ధం కావాలా.. అది పక్కన పెడితే ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ఏళ్లుగా సిద్ధపడుతున్న వారు.. కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగాలు చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: YCP: సీఎం జగన్ డైలాగ్ పై హైపర్ ఆది పంచ్ లు! వైరల్ అవుతున్న వీడియో! అలానే వీరిలో కేవలం 25 శాతం మంది అగ్నివీరులను మాత్రమే శాశ్వత సైనిక ఉద్యోగాల్లోకి ఎంపిక చేస్తారు. వీరంతా 15 ఏళ్లపాటు నాన్ ఆఫీసర్ ర్యాంకులో సేవలందించే వీలుంటుంది. మిగిలిన 75 శాతం మంది నాలుగేళ్ల తర్వాత రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ప్యాకేజీతో సేవల నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ప్రయోజనాలు పెద్దగా ఉండవు. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవడం కోసం తెచ్చిన ఈ పథకం ద్వారా రక్షణ వ్యవస్థని బలి చేయడమే అవుతుంది అంటున్నారు విశ్లేకులు. పూర్తి స్థాయి సైనికుడిగా నియమితుడైన వ్యక్తికి, అగ్నివీరులకు విధి నిర్వహణలో చాలా తేడా ఉంటుందని.. అంత బాధ్యతగా వ్యవహరించని అభిప్రాయపడుతున్నారు. అలానే ఈ సమస్యకు పరిష్కారంగా అగ్ని వీరులకు నాలుగేళ్ల సర్వీస్ కాలం పూర్తయిన తర్వాత ఇతర ఉద్యోగాల్లో వీరికి కోటా కేటాయిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Kodali Nani: ఆ పసి పిల్లలపై ట్రోల్స్ ఏంటి? దమ్ము ఉంటే మాతో పోరాడండి: కొడాలి నాని!