దేశానికి ప్రధాని అయిన తల్లికి కొడుకే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన తన తల్లిని కలిశారు. ఆమె నివాసానికి వెళ్లి ఆమెను దీవెనులు అందుకన్నారు. పుట్టిన రోజు సందర్భంగా మోదీ తల్లికి పాదపూజ చేసి ఆమెకు స్వీట్ తినిపించారు. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఇక్కడ ఆయన పంచమహల్ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పావగఢ్ ను సందర్శించనున్నారు. మోదీ తల్లి హీరాబెన్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అక్కడ ఒక రోడ్డుకి ఆమె పేరుపెట్టాలని నిశ్చయించింది గాంధీ నగర్ నగర పాలక సంస్థ. గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో దాదాపు 80 మీటర్ల పొడవు గల మార్గానికి ‘పూజ్య హీరాబా మార్గ్’ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్ తరలా వారికి ఆమె పేరు శాశ్వతంగా గుర్తుండి పోయేలా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఇక ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబేన్ కి వందేళ్ల వయసు ఉన్నప్పటికీ ఆమె ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఆమె అనారోగ్యానికి గురయినట్టు ఎప్పుడూ వార్తలు రాలేదు. ఆమె చిన్న మొత్తంలో సాత్వికాహారం తీసుకోవడం అలవాటు. ఆమె ఆరోగ్యానికి అదే కారణం కావచ్చని అంటుంటారు. ప్రస్తుతం ఆమె తన చిన్న కుమారుడు పంకజ్ మోదీ వద్ద ఆమె ఉంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Took blessings of my mother today as she enters her 100th year... pic.twitter.com/lTEVGcyzdX — Narendra Modi (@narendramodi) June 18, 2022