సాంకేతికత పెరిగిన తర్వాత మనుషుల మధ్య బంధాలు తగ్గిపోతున్నాయి.. అసలు స్పందించడమే మరిచిపోతున్నాడు. నిత్యం ఉరుకులు పరుగులతో బిజీగా ఉంటున్నాడు. కుటుంబ సభ్యులతోనే మాట్లాడే తీరిక లేనప్పుడు.. ఇక తన చుట్టూ ఉండే వారిని ఏం పట్టించుకుంటాడు. ప్రస్తుతం సమాజంలో పరిస్థితి ఇలానే ఉంది. అయితే అందరూ ఇలానే ఉంటారా అంటారా అంటే కాదు. కష్టంలో ఉన్న వారి గురించి తెలిస్తే చాలు.. ఆదుకునేందుకు ఎందరో దాతలు ముందురు వస్తారు. ఇలాంటి సంఘటనలు అనేకం నిత్యం వెలుగు చూస్తుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతుంది. వైద్యంలో భాగంగా ఒక్క ఇంజెక్షన్ ఖరీదే 22 కోట్ల రూపాయలు. రెక్కాడితే కానీ డొక్కాడని తల్లిదండ్రులు.. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక.. బిడ్డను ఎలా బతికించుకోవాలో అర్థంకాక సతమతమయ్యారు. ఆదుకోవాల్సిందిగా అభ్యర్ధించారు. చిన్నారి కష్టం తెలుసుకున్న ఓ ఫార్మ కంపెనీ.. ముందుకు వచ్చి ఆదుకుంది. 16 రూపాయల ఖరీదైన ఇంజక్షన్ను ఉచితంగా ఇచ్చి.. చిన్నారి ప్రాణాలు నిలబెట్టింది. ఆ వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లికి చెందిన ప్రవీణ్, స్టెల్లా దంపతుల 23 నెలల చిన్నారికి అత్యంత అరుదైన వ్యాధి స్పైనల్ మస్కులర్ అట్రోపి-2(ఎస్ఎమ్ఎ) సోకింది. ఈ వ్యాధి నుంచి కాపాడాలంటే జోలెన్స్మా అనే ఇంజక్షన్ ఇవ్వాలి. దీన్ని అమెరికా లేదంటే స్విట్జర్లాండ్ నుంచి తెప్పించాలి. పన్నులతో కలిపి ఖరీదు రూ.22 కోట్లు అవుతుంది. ఈ క్రమంలో మానవీయ కోణంలో దీనిపై ఉన్న ఎక్సైజ్ సుంకం, జీఎస్టీతో కలిపి రూ.6 కోట్లను కేంద్రం ఎత్తేసింది. అయినా కొనడం కష్టం కావడంతో కొందరు క్రౌడ్ ఫండింగ్తో నిధులు సేకరిస్తుంటారు. ప్రవీణ్, స్టెల్లా దంపతులు కూడా ఇదే విధానం ఫాలో అయ్యారు. తమ కుమార్తెకు వచ్చిన వ్యాధి గురించి వివరిస్తూ.. ఆదుకోవాల్సిందిగా కోరారు. ఈ విషయం కాస్త.. ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ నోవార్టిస్ ఫార్మా కంపెనీకి తెలిసింది. దాంతో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ను ఉచితంగా అందజేసింది. సికింద్రాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స అందించారు. క్రమంగా కోలుకుంటుండటంతో తాజాగా చిన్నారిని డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన ఆయన గుప్తాకి కూడా ఇదే వ్యాధి సోకడంతో ఇంపాక్ట్ గురు అనే అన్లైన్ క్రౌండ్ ఫండింగ్ సంస్థ ద్వారా పిలుపు ఇవ్వగా ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఉదారత చాటి రూ.16 కోట్లపైనే విరాళాలు అందించారు. అమెరికా నుంచి ఇంజక్షన్ తెప్పించి బాలుణ్ని కాపాడారు. ఇప్పటి వరకు నగరం కేంద్రంగా నలుగురు పిల్లలకు ఇలాంటి చికిత్స అందించారు. ప్రస్తుతం మరో చిన్నారి చికిత్సకు సిద్ధమవుతున్నారు. నడవలేరు.. తినలేరు స్పైనల్ మస్కులర్ అట్రోపి-2(ఎస్ఎమ్ఎ)గా వ్యవహరించే ఈ వ్యాధి వల్ల మెదడు కండరాలు క్షీణిస్తాయి. ఇది చిన్నప్పుడే బయట పడుతుంది. మాట్లాడకపోవడం.. నడవక పోవడం.. పడుకొని లేవలేకపోవడం.. ఆహారం మింగలేకపోవడం వంటివి ప్రధానంగా కనిపించే లక్షణాలు. గతంలో రాజస్థాన్కు చెందిన నూరాఫాతిమా(6 నెలలు)కు ఈ వ్యాధి సోకింది. తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.40 లక్షల వరకు సేకరించారు. కేంద్రం రూ. 6 కోట్ల మేర పన్నులను తగ్గించింది. అప్పటికే చికిత్సలో ఆలస్యం జరగడంతో చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఖమ్మం చిన్నారి ఈ వ్యాధి నుంచి బయటపడింది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: కంట తడి పెట్టిస్తున్న NRI మహిళ చివరి సెల్ఫీ వీడియో! ఇది కూడా చదవండి: ఏడో ఏట కిడ్నాప్.. సినిమాను తలపించే ట్విస్టులతో సాగి.. చివరకు!