ప్రతిభకు చదువుతో సంబంధం లేదు. ప్రస్తుతం సమాజంలోని చాలా ఆవిష్కరణలు చేసింది సామాన్యులు, గొప్ప చదువులు లేని వారంటే అతిశయోక్తి కాదు. మనిషి ఎదుర్కొనే సమస్యలే అతడి ఆలోచనా విధానాన్ని మార్చుతాయి. సమస్యకు పరిష్కారం వెదికే దిశగా చేసే ప్రయత్నాలే అద్భుత ఆవిష్కరణలకు దారి తీస్తాయి. ఈ కోవకు చెందిన సంఘటనే ఒకటి ఒడిశాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతలా పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పైగా ఇవి తరిగిపోయే వనరులు. వినియోగం పెరుగుతున్న కొద్ద లభ్యత తక్కువవుతుంది. అందుకే ప్రభుత్వాలు ప్రత్యామ్నయ మార్గాల దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో సామాన్యులకు కూడా పెట్రోల్, డీజిల్ వంటి వాటికి ప్రత్యామ్నయ వనరులు గురించి పరిశోధనలు చేస్తున్నారు. వీరిలో ఒడిశాకు చెందిన అజయ్ బెహ్రా వినూత్న ఆలోచన చేశాడు. ప్రసుత్తం మానవాళిని వణికిస్తున్న ప్లాస్టిక్ భూతం నుంచి పెట్రోల్ తయారు చేసి.. ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆ వివరాలు.. ఇది కూడా చదవండి: Tenth Exam: పట్టు వదలక..కొడుకుతో కలిసి పది పరీక్షలు రాసిన తల్లి! ఒడిశా, రాధాచరణ్పూర్కి చెందిన అజయ్ బ్రెహా అనే యువకుడు ప్లాస్టిక్తో పెట్రోల్ తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. చదివింది ఏడో తరగతే అయినా.. తన టాలెంట్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వృధాగా పోయే ప్లాస్టిక్ బాటిళ్లు, పాలిథిన్ కవర్లను వినియోగించి పెట్రోల్ తయారు చేస్తూ.. పర్యావరణాన్ని కాపాడటంలో.. తన వంతు తొడ్పాటు అందిస్తున్నాడు. రోజుకు 12-13 కేజీల పాలిథిన్ సేకరించి.. దానితో సుమారు 7-8 లీటర్ల పెట్రోల్ను తయారు చేస్తున్నాడు. తాను తయారు చేసిన పెట్రోల్ లీటర్కి 50 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని తెలిపాడు. తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అజయ్ తన బైక్ని 80 వేల రూపాయలకు అమ్మాడు. ఆ తర్వాత స్నేహితుల వద్ద నుంచి మరికొంత మొత్తం తీసుకుని.. పెట్రోల్ తయారు చేసే యంత్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపాడు. కేజీ పాలిథిన్ నుంచి 600 మిల్లీ గ్రామాలు పెట్రోల్ వస్తుందన్నాడు. ప్రభుత్వం తనకు సాయం చేస్తే.. జనాలకు తక్కువ ధరకే పెట్రోల్ అందిస్తానని తెలిపాడు. అజయ్ ప్రతిభపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Vikarabad: రెండు బీర్లు కావాలి అంటూ అర్ధరాత్రి డయల్ 100కి ఫోన్ చేసిన యువకుడు! మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.