కిడ్నాప్ వంటి నేరాల్లో సామాన్యంగా బాధితులు తిరిగి వారి ఇళ్లకు చేరడం దాదాపు అసాధ్యం. అది కూడా ఏళ్ల తర్వాత ఇంటికి చేరడం అంటే.. నిజంగానే ఏదో అద్భుతం చోటు చేసుకుంటే తప్పితే.. ఇలాంటి సంఘటనలు వాస్తవ రూపం దాల్చవు. కానీ ఇప్పుడు చదవబోయే ఈ కిడ్నాప్ కథ చూస్తే.. ఆశ్చర్యం వేస్తుంది. సదరు బాధితురాలు ఎంతటి అదృష్టవంతురాలో కదా అనిపిస్తుంది. ఏడేళ్ల వయసులో ఓ బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. తల్లిదండ్రులు, పోలీసులు ఎంత గాలించినా లాభం లేకపోయింది. ఇక ఆశ వదిలేసుకున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత సదరు బాధితురాలు.. తిరిగి కుటుంబ సభ్యులను చేరుకుంది. అది కూడా ఊహించని ట్విస్ట్తో.. సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించేలా ఉన్న ఈ ఘటన మహారాష్ట్ర ముంబయిలోని అంధేరిలో వెలుగుచూసింది. ఆ వివరాలు.. బాధితురాలి పేరు పూజ. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం అంటే.. 2013లో ఆమె కిడ్నాప్కు గురైంది. జనవరి 22. ఆ రోజు ఉదయాన్నే పూజ (7) తన సోదరుడితో కలిసి అంధేరిలోని ఓ పాఠశాలకు వెళ్లింది. అయితే, అక్కడ హెన్రీ జోసెఫ్ డిసౌజా అనే వ్యక్తి ఆమెకు ఐస్క్రీమ్ ఆశచూపి కిడ్నాప్ చేశాడు. ఎందుకంటే అతడికి పిల్లల్లేరు. దత్తత వంటి కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చవుతుండటంతో.. ఇలా కిడ్నాప్కు పాల్పడ్డాడు. పూజను ఎవరూ గుర్తు పట్టలేరని నిర్ధారించుకున్నాక హెన్రీ ఆమెను కర్ణాటకలోని ఓ హాస్టల్లో చేర్పించాడు. బాలిక పేరును అన్నె డిసౌజాగా మార్చాడు. అయితే, కొన్నాళ్లకు హెన్రీ దంపతులకు బిడ్డ పుట్టడంతో పూజను తీసుకొచ్చి ఇంటి పనులు చేయించుకోవడంతో పాటు సరిగా చూసుకొనేవారు కాదు. అలా తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. తాగిన మైకంలో అసలు విషయం బయటకు.. కానీ, హెన్రీనే తన తండ్రిగా భావిస్తూ వచ్చిన పూజకు ఒక రోజు షాకింగ్ విషయం తెలిసింది. అతడు తాగిన మైకంలో ఉన్నప్పుడు ఆమె తన కూతురు కాదన్న విషయం పూజ వద్దే చెప్పాడు. దీంతో షాక్ అయిన బాలిక... తన గత ఆనవాళ్లను తెలుసుకొనే ప్రయత్నం చేసింది. ఇందుకోసం తన ఫ్రెండ్ సహకారం తీసుకొని ఇంటర్నెట్లో శోధన కొనసాగించింది. Ponja missing అని వెతకగా.. చివరకు 2013లో తాను తప్పిపోయినట్లుగా ఉన్న పోస్టర్ ఒకటి కంటపడింది. దాంట్లో ఐదు ఫోన్ నంబర్లు ఉండగా..వాటికి ట్రై చేసింది. కానీ నాలుగు నంబర్లు పనిచేయలేదు. చివరకు ఐదో నంబరు డయల్ చేయగా.. ఆ నంబర్ ఆమె కుటుంబం పొరుగున నివసించే రఫీక్ అనే వ్యక్తిది. దీంతో పూజ తన గురించి మొత్తం విషయాన్ని చెప్పింది. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన రఫీక్ వీడియో కాల్ చేసి బాలికను పూజగా గుర్తించాడు. ఆ తర్వాత ఆమె తల్లితో మాట్లాడే ఏర్పాటు చేయించాడు. పూజను చూడగానే తల్లి గుర్తుపట్టింటి. తొమ్మిదేళ్ల తర్వాత తల్లీకూతులిద్దరు మొబైల్ స్క్రీన్ మీద ఒకరినొకరు చూసుకొని ఉద్వేగానికి లోనయ్యారు. చివరకు ఈ విషయం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగారు. డిసౌజాను అరెస్టు చేసి.. పూజను ఆమె కుటుంబంతో కలిపారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన బిడ్డ ఎక్కడుందో, ఏమైపోయిందో తెలియక నరకయాతన అనుభవించిన ఆ తల్లి పూజను చూడగానే.. పట్టరాని సంతోషంతో కౌగిలించుకున్న దృశ్యాలు అక్కడున్నవారిని భావోద్వేగానికి గురిచేశాయి. అయితే, కిడ్నాపైన తర్వాత పూజ తన తండ్రిని కోల్పోయింది. చిన్నప్పుడు తమనుంచి దూరమైన పూజ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తమను కలుసుకోవడంతో బాలిక తల్లి, సోదరుడి ఆనందానికి అవధుల్లేవు. మరోవైపు, హెన్రీని అరెస్టు చేసిన పోలీసులు కిడ్నాపింగ్, చట్టవ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. పిల్లలు పుట్టకపోవడం వల్లే ఆ దంపతులిద్దరూ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు తెలిపిన పోలీసులు.. ఈ కేసులో అతడి భార్యను కూడా నిందితురాలిగా పేర్కొన్నట్టు తెలిపారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: పాపం గూగుల్ మ్యాప్స్ను నమ్ముకున్న కుటుంబం పరిస్థితి ఏమైందంటే! ఇది కూడా చదవండి: వీడియో: తనలో గేదె ఆత్మ ప్రవేశించిందంటూ వ్యక్తి విన్యాసాలు.. జంతువుగా మారి..