మన సమాజంలో ఎన్నో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఆకాశంలోకి రాకెట్ పంపిస్తాం.. కానీ ప్రయోగానికి ముందు దానికి పూజ చేస్తాం. శాస్త్రాన్ని మించిన మహా శక్తి ఏదో ఉందని.. మెజారిటీ ప్రజలు నమ్ముతారు. వుడిని నమ్మినట్లే దెయ్యాలను, ఆత్మలను కూడా నమ్ముతారు. భిన్నమైన ఈ రెండు శక్తులకు భయపడతారు. భూమిపై ఉన్న పంచభూతాలను సైతం దైవంగా కొలిచే సమాజం మనది. వర్షాలు కురవకపోతే యజ్ఞాలు చేస్తాం. కప్పలకు పెళ్లిల్లు చేస్తాం.. ఇంకా అలాంటి ఆచారాలు చాలానే ఉన్నాయి. అయితే, కర్ణాటకలోని బీజాపూర్లోని కలకేరి గ్రామస్తులు మాత్రం వర్షాల కోసం సమాధులు తవ్వుతారు. మృతదేహాలకు నీళ్లు పట్టిస్తారు. ఇందుకు ఒక కారణం కూడా ఉంది. అదేంటి.. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు తెలియాలంటే.. ఇది చదవండి... ప్రస్తుతం దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు నిండి పొంగి పొర్లుతున్నాయి. భారీ వరదల వల్ల జనజీవితం ఎంత అస్తవ్యస్తంగా మారిందో ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. మరి దేశవ్యాప్తంగా ఇంత భారీ వర్షాలు కురుస్తున్న.. కొన్ని చోట్ల మాత్రం.. వాన జాడే లేదు. నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నారు కొన్ని ప్రాంతాల ప్రజలు. ఈ క్రమంలో వారు.. వానలు కురిపించమని కోరుతూ.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని కలికెరి గ్రామంలో సైతం వర్షాలు కురవడం లేదు. వాస్తవానికి జూన్ నెలలోనే కర్ణాకటలో వర్షాలు మొదలవుతాయి. కానీ, ఆ గ్రామంలో మాత్రం చుక్క చినుకు కూడా పడలేదు. దీంతో గ్రామస్తులంతా కూర్చొని.. మృతదేహాల దాహాన్ని తీర్చాలని డిసైడ్ అయ్యారు. దీంతో గత నెలలో చనిపోయిన వ్యక్తుల పేర్లతో ఒక జాబితాను తయారు చేశారు. సంబంధిత కుటుంబికులను పిలిచి.. చనిపోయిన మీ ఆప్తుల దప్పికను తీర్చేందుకు సహకరించాలని కోరారు. కుటుంబికులను సమాధుల వద్దకు తీసుకెళ్లి.. తల ఏ దిక్కున పెట్టారో తెలుసుకున్నారు. అక్కడ రెండు అడుగుల గుంత తవ్వి మృతదేహం నోటి వరకు పైపును పంపారు. అనంతరం ట్యాంకర్ నుంచి నీటిని మృతదేహం నోట్లోకి వదిలారు. ఇలా సుమారు 25 సమాధుల్లోని మృతదేహాలకు నీళ్లు తాగించారు. చిత్రం ఏమిటంటే.. వారు ఇలా చేసిన కొద్దిసేపటికే ఆ ఊరిలో చినుకులు పడటం మొదలైంది. దీంతో వారి నమ్మకం మరింత బలపడింది. ఆ శాపం కారణంగానే ఈ ఆచారం.. ఈ గ్రామంలో సుమారు మూడు వేల మంది నివసిస్తున్నారు. వీరంతా వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. వర్షాలు కురవకపోతే ఏడాది మొత్తం అంతా పస్తులుండాల్సిందే. తమ ఊరిలో వర్షాలు కురవకపోవడానికి గల కారణం.. చాలా ఏళ్ల కిందటి శాపమే కారణమని స్థానికులు చెబుతుంటారు. కలకేరిలో ఒక వృద్ధుడు తన నోరు పెద్దగా తెరిచి చనిపోయాడు. నోరు మూయకుండానే అతడిని ఖననం చేశారు. ఆ ఏడాది తర్వాత గ్రామంలో తీవ్ర కరువు, దుర్భిక్షం వచ్చిందట. దీంతో గ్రామస్తులు జ్యోతిష్కుడిని పిలిపించి కరువుకు కారణం తెలుసుకోవాలని కోరారు. పిలిచారు, దాహంతో ఉన్న శవం గ్రామాన్ని శపించిందని ఆ జ్యోతిష్కుడు చెప్పాడు. అతడి సూచన మేరకు సమాధని తవ్వి ఆ వృద్ధుడి సమాధి తవ్వి మృతదేహానికి నీరు పట్టించారు. అలా చేసిన కొద్దిసేపటికే ఆ ఊరిలో వర్షం పడిందట. అప్పటి నుంచి ఊరిలో సమాయానికి వర్షాలు కురవకపోతే.. గ్రామస్తులు ఇలా సమాధులు తవ్వి.. శవాలకు నీరు పట్టిస్తున్నారు. మరి ఈ వింత ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Nagpur: కళ్ల ముందే నీటి పాలైన జీవితాలు.. చూడ్డం తప్ప కాపాడలేని పరిస్థితి! ఇది కూడా చదవండి: Video: అందరూ చూస్తుండగానే.. వరదలో కొట్టుకుపోయిన పోలీస్ స్టేషన్..! వీడియో వైరల్