ఇటీవల భారత వాయుసేన విభాగంలో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగ పలువురు పైలట్లు దుర్మరణం పాలవుతున్నారు. తాజాగా భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మిగ్-21 యుద్ధ విమానం ఒకటి రాజస్థాన్లోని బర్మర్ జిల్లాలో ప్రమాదానికి గురైంది. కూలిన మిగ్-21 విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు భారత వైమానిక దళం వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. బార్మర్ జిల్లా సమీపంలో ఐఏఎఫ్ మిగ్-2 భీమ్డా గ్రామ సమీపంలో కూలిపోయినట్లు బార్మర్ జిల్లా కలెక్టర్ లోక్ బందు వెల్లడించారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రెండు సీట్లున్న ఈ విమానాన్ని శిక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. ఉత్తర్లాయ్ ఎయిర్బేస్ నుంచి బయలుదేరిన విమానం భీమ్డా గ్రామం వద్ద నేలకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో ఇద్దరు విమానంలోని ఇద్దరు పైలట్లు మృతిచెందారు. గత ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఆరు మిగ్–21 విమానాలు కుప్పకూలినట్లు సమాచారం. ఈ ప్రమాదాల్లో ఐదుగురు పైలట్లు బలయ్యారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Rajasthan | A MiG-21 fighter aircraft of the Indian Air Force crashed near Barmer district. Further details awaited pic.twitter.com/egJweDNL4a — ANI (@ANI) July 28, 2022 ఇది చదవండి: మరో 24 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక!