దేశంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అసోం లో భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలకు కొండ చరియలు కూలి రాష్ట్ర వ్యాప్తంగా 140 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తుంది. తాజాగా భారీ వరదలకు ఓ పోలీస్ స్టేషన్ కూలిపోయి వరదలో కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెలితే.. అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరద నీటి ప్రవాహంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. భంగనమరి ప్రాంతం కూడా పూర్తిగా జలమయమైపోయింది. భారీ వర్షాలకు నల్బరీ జిల్లాలో బ్రహ్మపుత్ర నది సమీపంలో ఉన్న ఓ పోలీస్ స్టేషన్ కుప్పకూలి అందరూ చూస్తుండగానే వరదలో కొట్టుకు పోయింది. అయితే భారీ వర్షాలకు పోలీస్ స్టేషన్ కూలిపోతుందని ముందుగానే భావించిన సిబ్బంది అప్పటికే ఖాళీ చేశారు. దీంతో ఎవరి ప్రాణాలకు హాని జరగలేదు. అసోంలో వరద బీభత్సం ఏ స్థాయిలో ఉందో ఈ దృశ్యం చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ భవనం కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అస్సాంలో వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, ఆహారం అందక విలవిలలాడుతున్నారు. దీంతో ఆర్మీ, అస్సాం అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో వరద పరిస్థితి, సహాయక చర్యలపై సమీక్షించేందుకు సీఎం హిమంత బిస్వా శర్మ కాచర్ జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #WATCH | A part of the two-storied building of Bhangnamari police station sinks due to flood in Assam's Nalbari district (Source: Unverified) pic.twitter.com/CMHpcgpHmN — ANI (@ANI) June 28, 2022