Maharashtra: గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ కేవలం గొప్ప చదువులు చదివితేనో లేక ఏసీ గదుల్లో కూర్చుని ఆలోచిస్తేనో పుట్టుకు రావు. సమస్య ఎక్కడుంటే అక్కడ నుంచే పుట్టుకొస్తాయి. అది ఎవరి సమస్య అయినా కానియ్యండి. ఆ సమస్యని ఓన్ చేసుకుని దానికో పరిష్కారం కనిపెట్టాలి అన్న ఆలోచనలోంచి పుట్టుకొస్తాయి. సమస్య అనేది గర్భం అయితే.. దాన్నుండి వచ్చే గొప్ప ఆవిష్కరణ ఒక బేబీ లాంటిది. ఇప్పటివరకూ వచ్చిన ఆవిష్కరణలన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఆవిష్కరణ మరొక ఎత్తు. ఈ భూమ్మీద చాలా మంది తేలికగా తీసుకునే వృత్తి ఒకటే ఉంది. అదే వ్యవసాయం. వ్యవసాయం చేసుకునే రైతుల గురించి ఎవ్వరూ ఆలోచించరు. అలాంటిది వ్యవసాయం చేసుకునే రైతుకి ఉపయోగపడే ఎద్దుల గురించి ఎవరైనా ఆలోచిస్తారా? రైతులకే దిక్కు లేదు, ఇక పశువుల గురించి ఆలోచించడం కూడానా.. అని అనుకోకండి. మూగ జీవాల గురించి కూడా ఆలోచించేవారు ఉంటారు. మహారాష్ట్రలోని, సంగ్లీ జిల్లా, ఇస్లాంపూర్ లోని ఆర్ఐటీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న సౌరభ్ భోస్లే, ఆకాశ్ కదం, నిఖిల్ తిపాయలే, ఆకాశ్ గైక్వాడ్, ఓంకార్ మిరజ్కర్ లు ఎద్దులు పడే బాధ చూడలేక ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. ఎడ్లపై ఎడ్ల బండి భారం తగ్గించేందుకు బండికి రోలింగ్ సపోర్ట్ ఏర్పాటు చేశారు. సాధారణంగా గ్రామాల్లో రైతులు ఎద్దులబండి మీద వ్యవసాయ సంబంధిత పనులు చేసుకుంటూ ఉంటారు. ఎద్దులు మోసే బండే బరువు అనుకుంటే.. బండి మీద ఉండే లోడు అంతకంటే బరువు ఎక్కువగా ఉంటుంది. మనసున్న మారాజులకి తప్ప.. ఆ ఎద్దులు పడే కష్టం ఎవరికీ తెలియదు. ఆ మనసున్న మారాజులే ఆ ఇంజనీరింగ్ విద్యార్థులు. మూగ జీవాలపై ఎడ్ల బండి భారాన్ని తగ్గించేలా ఇలా వినూత్నంగా ఆలోచించారు. ఎడ్ల యొక్క వీపుపై భారం పడకుండా ముందు భాగంలో చక్రాన్ని అమర్చారు. దీనివల్ల ఎడ్లపై ఏమాత్రం భారం ఉండదు. బండిని తేలికగా ముందుకు తీసుకెళ్తాయి. నిజానికి ఇదొక గొప్ప ఇన్నోవేషన్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మామూలుగా వ్యవసాయం చేసే రైతులు పశువుల పట్ల చాలా ప్రేమతో ఉంటారు. వాటిని తమ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటారు. ఆవులు, ఎద్దులతో ఉండే ఆ ఎమోషనల్ బాండ్ గురించి మాటల్లో చెప్పలేము. బాగా దగ్గర నుండి చూసిన వారికి మాత్రమే ఆ అనుభూతి అర్ధమవుతుంది. వీళ్ళు కూడా రైతు బిడ్డలు కావడం వల్ల ఎద్దుల సమస్యని తమ కుటుంబ సభ్యుల సమస్యగా ఆలోచించి ఇలా భారం తగ్గించే ఆవిష్కరణ చేశారు. ఇదేమీ ఖరీదైన ఆవిష్కరణ కాకపోవచ్చు, కానీ గొప్ప ఆవిష్కరణ అని చెప్పాలి. దీని విలువ ఊళ్ళో ఉండే రైతులకి, రైతు బిడ్డలకే తెలుస్తుంది. "రైతు కుటుంబాలకు చెందిన పిల్లలేమో.. అందుకే ఇలా ఆలోచించారు.. రైతు కుటుంబాల్లో ఎడ్లు కూడా కుటుంబసభ్యులే కదా. ఎద్దు బాగుంటేనే కదా వ్యవసాయం బాగుండేది.. భేష్..విద్యార్థుల ఆలోచన, కృషి అభినందనీయం" అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆవిష్కరణ అంటే ఏసీ గదుల్లోంచే కాదు, స్వచ్ఛమైన మనసున్న గుండె గదుల్లోంచి కూడా వస్తాయని నిరూపించారు ఈ రైతు బిడ్డలు. మీ ఆవిష్కరణకు మా జోహార్లు రైతు బిడ్డలు. మూగ జీవాల పట్ల ఈ రైతు బిడ్డలు చూపించిన ప్రేమపై.. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మూగ జీవాల పట్ల ప్రేమ ఉంటే ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి. ఈ ఆవిష్కరణను మాత్రం మీ ఊరి రైతులతో ఖచ్చితంగా పంచుకోండి. ఎద్దుల భారం తగ్గించడం ముఖ్యం బిగిలు.. ఇది కూడా చదవండి: మగ బిడ్డ కోసం పూజలు! ఆ కోరిక తీరిందని మరో బిడ్డని బలి ఇచ్చాడు!