Crocodile: నీటిలో నివసించే వాటిలో మొసళ్లు చాలా ప్రమాదకరమైన జంతువులు. ఇవి తమ వేటను చాలా దారుణంగా చంపి తింటాయి. వాటి పళ్లకు చిక్కి ప్రాణాలతో బయట పడటం చాలా అరుదు. ఎందుకంటే.. ఇవి తమ వేటను పట్టుకోగానే నీటిలో గింగిరాలు తిరుగుతూ వేటను ముక్కలు చేస్తాయి. పదునైన పళ్లతో ముక్కలు, ముక్కలు చేసి మింగేస్తాయి. తాజాగా, మధ్య ప్రదేశ్లో ఓ మొసలి పదేళ్ల బాలుడ్ని వేటాడి తినింది. అయితే, మొసలి కడుపులో బాలుడు బతికే ఉన్నాడంటూ, బాలుడ్ని బయటకు తీసుకురావటానికి గ్రామస్తులు దాన్ని కట్టేసి కాపలా కాసారు. వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్, షియోపూర్ జిల్లా రిజెంటా గ్రామానికి చెందిన పదేళ్ల అతర్ సింగ్ సోమవారం ఊరి బయట ఉన్న నదిలో స్నానం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఓ భారీ మొసలి చప్పుడు చేయకుండా అతడు స్నానం చేస్తున్న ప్రాంతానికి వచ్చింది. ఠక్కున అతర్ను పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లింది. అయితే, విషయం తెలుసుకున్న ప్రజలు మొసలి కోసం నీటిలో అన్వేషించారు. దాన్ని పట్టుకుని బడ్డుకు చేర్చారు. తాళ్లతో గట్టిగా బంధించి ఉంచారు. గంటలు గడుస్తున్నా దాన్ని వదిలి వేయలేదు. మొసలిని కట్టేసిన సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ వారు అక్కడికి చేరుకున్నారు. ఎందుకు మొసలిని కట్టేశారని గ్రామస్తులను అడిగారు. అప్పుడు కొంతమంది గ్రామస్తులు.. మొసలి బాలుడ్ని మింగేసిన సంగతి చెప్పారు. మొసలి కడుపులో బాలుడు బతికే ఉన్నాడని, బాలుడ్ని బయటకు తీసుకురావటానికి చూస్తున్నామని అన్నారు. మరికొంతమంది మొసలి కడుపును చీల్చి బాలుడ్ని రక్షించాలని కోరారు. అధికారులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మొసలి దేన్నైనా వేటాడితే పూర్తిగా మింగదని, మొసలి కడుపులో బాలుడు బతికుండే అవకాశం లేదని చెప్పారు. అధికారుల మాటలతో గ్రామస్తులు దాన్ని వదిలేశారు. బాలుడి శవం కోసం నదిలో అన్వేషించగా ఓ చోట నీటిపై తేలియాడుతూ కనిపించింది. దీంతో అధికారులు బాలుడి మృతదేహాన్ని బాధితుడి కుటుంబానికి అప్పగించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Bride Agreement “పెళ్లయ్యాక ఇలానే ఉండాలి”..! కాబోయే భర్తకి పెళ్లికూతురు కండిషన్స్!