Google Maps: ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి గూగుల్ మ్యాప్స్ ఓ నిత్యావసరంగా మారింది. ముఖ్యంగా డెలివరీ బాయ్స్ అడ్రస్ను తెలుసుకోవటానికి గూగుల్ మ్యాప్స్ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నిజం చెప్పాలంటే గూగుల్ మ్యాప్స్ లేకపోతే చాలా మందికి ఉపాది లేదు. గూగుల్ మ్యాప్స్లోని ప్రత్యేకమైన ఫ్యీచర్స్ కారణంగా ఏ అడ్రస్నైనా ఇట్టే కనిపెట్టేయొచ్చు. ముఖ్యంగా కొత్త కొత్త ఊర్లకు ప్రయాణించే వాళ్లకు గూగుల్ మ్యాప్స్ ఎంతో అవసరంగా ఉంటోంది. వాహనం ఏదైనా కానీ, మొబైల్లో గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే మనకు కావాల్సిన అడ్రస్కు మార్గాన్ని తెలుసుకుని వెళ్లొచ్చు. ఇక, గూగుల్ మ్యాప్స్ కూడా యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా ఫీచర్స్ను అప్డేట్ చేస్తోంది. కానీ, కొన్ని విషయాల్లో మాత్రం వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా, గూగుల్ మ్యాప్స్ను నమ్ముకుని వెళ్లిన ఓ కుటుంబంలో నీళ్లలో తేలింది. ఇంతకీ సంగతేంటంటే.. గురువారం కేరళకు చెందిన ఓ కుటుంబం కారులో ఎర్నాకుళం నుంచి పతానం తిట్టలోని కుంబనాడ్కు బయలుదేరింది. కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ను ఫాలో అవుతూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. కారు నట్టక్కోమ్ బైపాస్నుంచి తిరువతుక్కల్లోని ఎంసీ రోడ్లోకి వచ్చింది. గూగుల్ మ్యాప్స్ను ఫాలో అవుతున్న డ్రైవర్ రూటు తెలియక.. కారును నేరుగా నీటి కుంటలోకి పోనిచ్చాడు. కారు రాత్రి 10.30 గంటల నేపథ్యంలో పరేచల్ బ్రిడ్జి దగ్గరకు రాగానే నేరుగా నీళ్లలోకి వెళ్లిపోయింది. అది గమనించిన అక్కడే ఉన్న ఓ షాపులోని మహిళ కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వాళ్లు వారికి సహాయం చేయటానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కారులోని వారిని బయటకు తీశారు. బాధితుల్లో నెలల చిన్నారి కూడా ఉంది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : పనిచేస్తే ఓకే.. లేదంటే ఇంటికే.. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్రం వార్నింగ్!