సాధారణంగా ఎవరికైనా ఒక్కరోజు లేదా రెండు రోజులు స్నానం చేయకుంటే ఒంటిపై ఏదో పాకినట్లుగా చిరాకుగా ఉంటుంది. అంతేకాదు ఒంటి నుంచి ఒకరకమైన దుర్వాసన కూడా వస్తుంది. కానీ... ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 22 ఏళ్ల నుంచి అసలు స్నానం చేయలేదు.. విచిత్రం ఏంటంటే అతని ఒంటి నుంచి దుర్వాసన రాదు.. అతను ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడలేదు. ఇంతకీ ఎవరు ఆయన ఎక్కడ ఉంటాడు.. ఎందుకు అన్ని సంవత్సరాల నుంచి స్నానం చేయడం లేదు అన్న విషయం గురించి తెలుసుకుందాం... బీహార్.. గోపాల్గంజ్ జిల్లా బైకుంఠపుర్కు చెందిన ధరమ్దేవ్ రామ్.. 2000 సంవత్సరం నుంచి ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. ఇన్నేళ్ల నుంచి స్నానం చేయకపోయినా ఎలాంటి జబ్బులు రాలేదని ధరమ్దేవ్ చెబుతున్నారు. అయితే ఆయన స్నానం చేయకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని స్థానికులు అంటుంటారు. 2000 సంవత్సరంలో ఆయన స్నానం చేయనని ఓ శపథాన్ని పూనారు.. వింటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా.. దీని వెనక ఉన్న కారణం తెలిస్తే ఆయనను మెచ్చుకోకుండా ఉండలేరు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు తన మనసును కదిలించాయని.. ఈ దురాఘతాలకు వ్యతిరేకంగా ఆయన స్నానం చేయడం మానివేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు పాటు భూతగాదాలు, హత్యలు ఆగిపోయేంత వరకు స్నానం చేయబోనని ప్రతిజ్ఞ చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 62 కాగా.. 40ఏళ్ల వయసులోనే స్నానాన్ని ఆపేశారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన ప్రతిజ్ఞకు కట్టుబడే ఉన్నారు ధరమ్దేవ్. భార్య, కుమారుడు మరణించిన సమయంలోనూ ఆయన స్నానం చేయలేదని స్థానికులు చెబుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో ధరమ్ దేవ్ మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను.. 1987లో భూ తగాదాలు, జంతు వధ, మహిళలపై జరుగుతున్న నేరాల గురించి తెలుసుకున్నానని.. దాంతో మనసు ఎంతో బాధకలిగిందని.. ఈ అన్యాయాలపై వ్యతిరేకంగా అప్పటి నుండి స్నానం చేయకూడదని నిశ్చయించుకున్నానని.. నేను ఒక గురువుతో 6 నెలలు గడిపానని, గురుదక్షిణ పొందానని ఆయన చెప్పారు. ధర్మదేవుడు శ్రీరాముడిని ఆదర్శంగా భావించి ఆయన మాటలతో జీవిస్తానని అన్నారు.’ ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది చదవండి:వీడియో: స్కూల్లో విద్యార్థుల వింత ప్రవర్తన.. రంగంలోకి దిగిన ప్రభుత్వం! ఇది చదవండి: ఎవరీ ప్రవీణ్ కుమార్! క్యాసినో కింగ్ గా ఎలా ఎదిగాడు?