ప్రముఖ వ్యాపార దిగ్గజం మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. దేశంలో ఏది జరిగినా ఆ విషయంపై తనదైన స్పందన ట్విట్టర్ వేదికగా ఇస్తుంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ విభిన్నమైన వీడియోలను పోస్ట్ చేస్తూ.. నెటిజన్స్ ఆశ్చర్య పరిచే ఆనంద్ మహింద్రా రంగు రంగు లైట్లు, డిజిల్ వాచ్, మొబైల్ కలిగి ఉన్న స్కూటర్ వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఓ వ్యక్తి తనకున్నటువంటి స్కూటర్ ను తన అభిరుచికి తగ్గట్టుగా రీమోడలింగ్ చేపించుకున్నాడు. ఎలక్ట్రిక్ వాహనంగా మార్చడంతో పాటూ చుట్టూ లైట్లు, ముందు మొబైల్, డిజిటల్ వాచ్, స్పీకర్లు ఏర్పాటు చేయించుకున్నాడు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 60 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని యజమాని తెలిపాడు. ఒక్కసారి చార్జ్ చేస్తే 90కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చని చెప్పాడు. ఈ స్కూటర్ ఫోన్లో రాజేష్ ఖన్నా నటించిన ‘దో రాస్తే’లోని ‘చుప్ గయే సారే నజారే’ పాట ప్లే అవుతుండగా.. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ స్కూటర్ ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేయడంతో.. ‘జీవితం మీరు కోరుకున్నంత రంగుల మరియు వినోదాత్మకంగా ఉంటుంది’ అని పేర్కొంటూ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ స్కూటర్ పెళ్లి బారాత్ లో అలంకరించిన గుర్రంలా ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఇలాంటి రంగు రంగుల స్కూటర్ను ఎప్పుడు చూడలేదంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Life can be as colourful and entertaining as you want it to be… #OnlyInIndia pic.twitter.com/hAmmfye0Fo
— anand mahindra (@anandmahindra) June 17, 2022