కొద్దిరోజుల క్రితం ప్రారంభమైన అమర్నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఇటీవల భారీ వర్షాలకు వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అమర్ నాథ్ యాత్రికులపై ప్రకృతి బీభత్సం సృష్టించిది. కొండలపై నుంచి వస్తున్న వరదలో వేలాది మంది యాత్రికులు చిక్కుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ యాత్రను తాత్కలికంగా నిలిపివేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనలు 9 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గత కొన్నిరోజులుగా ఇక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే కొండ చరియల నుంచి భారీ వరద నీరు రావడంతో పన్నెండు వేల మంది ఇక్కడ చిక్కుకున్నట్లు తెలుస్తుంది. వరద నీరు గుడారాల్లోకి రావడంతో ఒక్కసారిగా యాత్రికులు భయాందోళనకు గురయ్యారు. అమర్నాథ్ గుహ సమీపంలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో నీరు వచ్చిందని చెబుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని జమ్మూ కాశ్మీర్ పోలీసు ఐజిపి తెలిపారు. కరోనా కారణంగా రెండేళ్లు అమర్ నాథ్ యాత్ర జరగలేదు. ఈ ఏడాది యాత్రకు భక్తులను అనుమతించగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అధికారులు ప్రస్తుతం యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ఇది చదవండి:Bihar: స్కూల్ యూనిఫామ్ ఇవ్వలేదని తల్వార్ తో బెదిరించిన తండ్రి! #WATCH | J&K: Visuals from lower reaches of Amarnath cave where a cloud burst was reported. Rescue operation underway by NDRF, SDRF & other agencies (Source: ITBP) pic.twitter.com/o6qsQ8S6iI — ANI (@ANI) July 8, 2022