దాదాపు చాలా రాష్ట్రాలు విద్యుత్ బిల్లులు పెంచాయి. దాంతో గత నెలతో పోలిస్తే ఈ నెల కాస్త ఎక్కువ బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. స్లాబు మారితే మోత మోగిపోతుంది. కొన్నిసార్లు రీడింగ్ తీసే వ్యక్తి పొరపాటు వల్లో, మిషన్ తప్పిదం వల్లో బిల్లు ఒక్కోసారి అధికంగా వస్తుంది. కొందరి లక్షల్లోనూ వచ్చిన సందర్భాలు చూశాం. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తికి మాత్రం వేల కోట్లలో కరెంట్ బిల్లు వచ్చింది. బిల్లుతో తగిలిన షాకుతో దెబ్బకు ఆస్పత్రి పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ శివ విహార్ కాలనీలోని సంజీవ్ కంకణేకి విద్యుత్ బిల్లు అక్షరాలా రూ.3,149 కోట్లు వచ్చింది. అది చూసి అతని తండ్రి మూర్ఛపోయి ఆస్పత్రిలో చేరారు. తమ కరెంట్ బిల్లు వేల కోట్లు రావడం చూసి షాక్ గురయ్యి తన తండ్రి మూర్ఛపోయినట్లు సంజీవ్ కంకణే వెల్లడించారు. అయితే తమ బిల్లు అంత రావడంపై తాము కూడా షాకైనట్లు తెలియజేశారు. తర్వాత తమ బిల్లు అంత రావడం ఏంటని పోర్టల్ లో తనిఖీ చేయగా సవరించిన విద్యుత్ బిల్లు కనిపించినట్లు తెలిపారు. వారికి రూ.1,300 బిల్లు ఉన్నట్లు తెలిపారు. ఈ విషయమై విద్యుత్ అధికారులు స్పందించారు. యూనిట్ల స్థానంలో వినియోగదారుడి నంబరు ఎంటర్ చేయడం వల్లే ఇలా వేల కోట్ల విద్యుత్ బిల్లు వచ్చినట్లు తెలిపారు. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అట్లుంటది కరెంట్ ఆఫీసుతోని అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ఇంతటి అదృష్టవంతుడిని ఎక్కడా చూసుండరు.. 2 గంటల్లో ఇల్లు అమ్మకం.. ఆలోపే లాటరీలో భారీ సొమ్ము! ఇదీ చదవండి: నడి రోడ్డుపై దహన సంస్కారాలు చేసేశారు! కారణం?