Madhya Pradesh: మనిషి తన జీవితంలో ఎన్నో కష్టాలు పడతాడు. చివరకు ప్రశాంతంగా చనిపోవాలనుకుంటాడు. మరి చనిపోయాక కూడా ప్రశాంతత లేకుంటే? చనిపోయాక ప్రశాంతత ఏంటా అని మీకు అనుమానం రావొచ్చ సహజమే. కానీ ఏ మనిషికైనా తాను చనిపోయాక తన అంత్యక్రియలు ప్రశాంతంగా ముగించాలని అనుకుంటాడు. దాంతో వారి ఆత్మ శాంతిస్తుందని వారి నమ్మకం. కాని వ్యవస్థ చేసిన తప్పులకు వీరు కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఊర్లో శ్మశానం లేక నడి రోడ్డుపైనే 70ఏళ్ల వృద్దురాలిని కాల్చిన అమానవీయ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. ప్రతీ ఊరికి ఓ శ్మశాన వాటిక ఉంటుంది. ఆ గ్రామంలో ఎవరు చనిపోయినా అక్కడే దహన సంస్కారాలు నిర్వహిస్తారు. కానీ ఆ ఊరికి మాత్రం వైకుంఠధామం లేదు. అదే మధ్యప్రదేశ్ లోని మెహగావ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అజ్నాల్ గ్రామాం.. గతంలో ఎవరైనా చనిపోతే వారివారి పోలాలల్లోనే అంత్యక్రియలు నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో పోలాల్లో నీరు చేరింది. దాంతో గత్యంతరం లేక చనిపోయిన ఓ వ్యక్తి దహన సంస్కారాలు నడి రోడ్డుమీదే చేశారు. ఇది తమను తీవ్రంగా కలిచివేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. గతంలో ఎన్నో సార్లు సర్పంచ్ కు, అధికారులకు తమ సమస్యను వినిపించినా గాని పట్టించుకోలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మాన్ సింగ్ కుష్వాహ స్పందించారు. ఇది బీజేపీ పాలన విధానాన్ని తెలియజేసిందని అన్నారు. "ఇది బీజేపీ ప్రభుత్వ అసలు ముఖాన్ని బట్టబయలు చేస్తుంది. ఇక్కడ ప్రజలు కనీస సౌకర్యాల కోసం బాధపడుతున్నారు. ప్రజలకు అన్ని విధాలా సహాయం చేస్తామని నేను హామీ ఇస్తున్నాను." అని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృధ్ది కోసం వేల కోట్లు వెంచిస్తున్నట్లు ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. ఈ క్రమంలో నడి రోడ్డుపై శవాన్ని కాల్చాల్సిన దుస్థితి రావడం చాలా బాధాకరం. మరి ఈ హృదయ విదారకమైన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. In a #shocking incident, natives of Ajnaul village in Bhind performed #lastrites of one person in middle of the #road, reason, no #cremation ground#MadhyaPradesh #Ajnaul #India #News #Viral #Death pic.twitter.com/rs1vBqiREN — Free Press Journal (@fpjindia) July 25, 2022 ఇదీ చదవండి: మైనర్ బాలుడు, పక్కింటి భార్య కేసులో ట్విస్ట్! ఇద్దరు హైదరాబాద్ లాడ్జ్ లో! ఇదీ చదవండి: విశాఖ యువతి గల్లంతు కేసులో షాకింగ్ ట్విస్ట్! సముద్రంలో ఎవరైనా తోసేశారా?