సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా నకీలీ వార్తల వ్యాప్తిని అడుకునేందుకు ఎప్పటికప్పుడు కేంద్రం చర్య తీసుకుంటుంది. నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఛానెళ్లపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కొన్ని ఛానెళ్లను కేంద్రం ప్రభుత్వం నిషేధించింది. తాజాగా మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. 202122 కాలంలో అసత్య వార్తలను ప్రసారం చేస్తున్న 94 యూట్యూబ్ ఛానెళ్ల పై కేంద్రం నిషేధించింది. వీటితో పాటు 19 సోషల్ మీడియా ఖాతాలు, 747 URLలపై నిషేధం విధించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య వార్తలను వ్యాప్తి చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. వైకాపా ఎంపీ అయోధ్య రామిరెడ్డి అడిన ప్రశ్నకు కేంద్ర సమాచారం శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ వివరాలు వెల్లడించారు. డిజిటల్ మాధ్యామాల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తి కట్టడికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2020 కింద గతేడాది ఫిబ్రవరి 25న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021ను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఈ రూల్స్ ప్రకారాం ఏదైన సామాజిక మాధ్యమ ఛానెళ్ల, సోషల్ మీడియా ఖాతా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించినట్లయితే చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అలానే నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా పీఐబీ ఆధ్వర్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ-2009 నవంబర్ లో నిజనిర్ధారణ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఠాకూర్ తెలిపారు. సామాజిక మాధ్యామాల్లో నకిలీ వార్తల వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలు రూపొందించే ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. మరి.. 94 ఛానెళ్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: కోర్టులో CMకు ఎదురుదెబ్బ! FIR నమోదు చేయండంటూ కోర్టు ఆదేశం! ఇదీ చదవండి: President Of India: కొత్త చరిత్రకు నాంది.. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము