ప్రతి మనిషి జీవితంలో వృద్ధాప్యం అనేది తప్పదు. అయితే ఒకప్పుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా పుష్టిగా జీవించేవారు. 100 ఏళ్లు వచ్చిన ఎంతో ఎనర్జీతో పనులు చేసే వారు. కానీ నేటికాలంలో ఆరు పదుల వయస్సు దాటితే చాలు.. చేతికి ఊతకర్ర కోసం వెదికే వారు చాలా మంది ఉన్నారు. అయితే నేటికాలంలో కూడా సెంచరికి దగ్గర ఉన్న కొందరు ఎంతో ఉత్సాహంతో చలాకీ గా ఉంటున్నారు. అనేక క్రీడల్లో, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్ని పతకాలు గెలుస్తున్నారు. అలాంటి కోవాకు చెందినదే మధ్యప్రదేశ్ కు చెందిన 80 ఏళ్ల బామ్మ. అయితే సాధించిన ఘనత ఏమిటో తెలిస్తే మీకు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి .. ఈ బామ్మ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.. మధ్యప్రదేశ్ లోని నీమచ్ జిల్లా మనాస మండలం జాలీనర్ గ్రామంలో సోహన్ బాబు అనే 80 ఏళ్ల బామ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆమె నిత్యం బాబా రామ్ దేవ్రాను పూజిస్తూ ఉంటారు. అయితే తన గ్రామాన్నికి 600 కిలోమీటర్ల దూరంలో బాబా రామ్ దేవ్రా ఆలయం ఉంది. ఓ రోజుల అక్కడి వెళ్లాలని భావించింది. అనుకున్నదే తడవుగా బైక్ పై బయలుదేరింది. ఒంటరిగానే బైక్ పై 600 కిలోమీటర్లు దూరం ప్రయాణించి..చివరికి రామ్ దేవ్రా దర్శనం చేసుకుంది. అనంతరం తిరిగి తన స్వగ్రామానికి అదే బైక్ పై బయలు దేరింది. మార్గం మధ్యలో ఆమెను పలకరించిన ఓ వ్యక్తి.. ఆ బామ్మ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో మాములు బామ్మ కాస్తా బైక్ బామ్మ మారిపోయింది. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సోహన్ బాయి బామ్మ విషయానికి వస్తే భర్తతో విడిపోయి.. తన బిడ్డలతో ఒంటరిగా జీవించారు. వారిని పెంచి పెద్ద చేసి.. ఓ ఇంటి వారిని చేశారు. ఇప్పుడు పిల్లలు అందరూ స్థిరపడి మంచి స్థితిలో ఉన్నారు. అయితే ఆమె మాత్రం మళ్లీ ఒంటరిగానే ఉంటున్నారు. మరి..ఈ 80 ఏళ్ల బామ చేసిన బైక్ సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.