దేశంలో పెట్రోల్ రేటు ఆయా రాష్ట్రాలను బట్టి 100 నుంచి 120 రూపాయల మధ్య ఉంది. మరి ఇలాంటి సమయంలో రూపాయికే లీటర్ పెట్రోల్ అంటే ఎలా ఉంటుంది. మనిషి వారం రోజుల ఏమి తినకుండా ఉన్నప్పుడు.. బిర్యానీ ఫ్రీ గా పెడుతున్నారంటే మన ఆకలి ఎలా ఉంటది.. అబ్బా చాలురా దేవుడా అనుకుంటాం కదా. తాజాగా.. మహారాష్ట్రలోని సోలాపూర్ లో ఓ పెట్రోల్ బంకులో రూపాయికే లీటర్ పెట్రోల్ పోయడంతో వాహనదారులు పోటెత్తారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గురువారం(ఏప్రిల్ 14) అంబేడ్కర్ జయంతి కావడంతో మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన.. ఓ పెట్రోల్ బంకు యాజమాన్యం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. రాజ్యాంగాన్ని రాసిన అంబేడ్కర్.. సామాన్య ప్రజల గురుంచి ఆ రోజుల్లో ఎలా ఆలోచించారో ప్రపంచానికి తెలియచెప్పాలనుకున్నాడు. రూపాయికే లీటర్ పెట్రోల్ అందిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో వాహనదారులు ఒక్కసారిగా పోటెత్తారు. "తన తోపాటు సామాన్యులకు భారమైన పెట్రోల్ ధరల్ని తగ్గించాలని ప్రధాని మోడీకి సందేశం ఇచ్చేందుకే ఇలా చేసినట్లు యాజమాన్యం తెలిపింది". అయితే.. రూపాయికే లీటర్ పెట్రోల్ పోయడంతో బంకు వద్ద ఉద్రిక్తత నెలకొంది. రద్దీని కట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. డబ్బంటే ఎంతకైనా తెగించే ఈ రోజుల్లో.. ఇలాంటి మంచి మనుషులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: 3 అడుగులే ఉన్నాడని ఎవరూ జాబు ఇవ్వలేదు.. ఇప్పుడు ఏకంగా 40 ఆఫర్లు! మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.