రష్యా, ఉక్రెయిన్ మధ్య కొన్ని వారాలుగా యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్ లో రష్యా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ లోని మారియుపోల్ లో 1300 మందికిపైగా తలదాచకుంటున్న ఓ థియేటర్ పై మార్చి16న రష్యా బాంబు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే వారిలో కనీసం 300 మందికిపైగా దుర్మరణం చెందినట్లు తాజాగా తేలింది! కీవ్ సమీపంలో ఉక్రెయిన్ దళాలకు ఇంధనం సరఫరా చేసే ఓ భారీ ఇంధనగారాన్ని ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్లోని ఓడరేవుల్లో చిక్కుబడ్డ 67 నౌకలు సురక్షితంగా వెళ్లిపోయేందుకు శుక్రవారం నుంచి అనుమతిస్తామని ప్రకటించింది. కొన్ని వారాల నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధం ఉక్రెయిన్ ను ఆర్థిక, ఇతర సంక్షోభంలోకి నెట్టేసింది. తిన్నడానికి తిండి, తాగటానికి నీరు కూడా దొరక్క దిక్కు లేక దేశమంతటా జనం అల్లాడుతున్నారు. దేశమంతా నిత్యవసర కొరత కనిపిస్తోంది. శవాలను తీసుకెళ్లేవారు కూడా లేకపోవడంతో మారియుపోల్ తరహాలో సామూహిక ఖననాలు జరుగుతున్నాయి. థియేటర్ పై బాంబు దాడిలో 300 మంది మరణిచారు అనే వార్తపై చాలామంది దిగ్భ్రాతికి గురిచేసింది. ఇదే క్రమంలో ఉక్రెయిన్ లో నాటో నేతృత్వంలో పాశ్చాత్య శాంతి పరిరక్షణ దళాలను మోహరించాలన్న ప్రతిపాదనలను రష్యా అనుకూలుడైన బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో తీవ్రగా వ్యతిరేకించారు. మరి..థియేటర్ పైదాడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Authorities in #Mariupol report that the bombing of the Drama Theater by a #Russian plane killed about 300 people. pic.twitter.com/5k2myuVFa4 — NEXTA (@nexta_tv) March 25, 2022 మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.