భారత్ కు చెందిన విమానాలు వరుసపెట్టి పాకిస్తాన్ గడ్డపై వాలుతున్నాయి. గతవారం స్ప్రెస్ జెట్ కు చెందిన ఢిల్లీ-దుబాయ్ విమానం ఇంధన ట్యాంకులో లోపం తలెత్తడంతో అత్యవసరంగా కరాచీలో ల్యాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే.. భారత్ కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విమానం ఒకటి అత్యవసరంగా పాకిస్థాన్ లోని కరాచీలో ల్యాండ్ అయ్యింది. యూఏఈలోని షార్జా నుంచి హైదరాబాద్ బయలుదేరిన విమానంలో టేక్ ఆఫ్ అయిన కాసేపటి తరువాత సాంకేతిక లోపన్ని గుర్తించిన ఫైలెట్లు అత్యవసరంగా కరాచీలో ల్యాండ్ చేశారు. ప్రస్తుతం అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే.. ప్రయాణికులను తరలించడం కోసం ఇండిగో మరో విమానాన్ని అక్కడకు పంపుతున్నట్లు ప్రకటించింది. ఈ మధ్యకాలంలో దేశీయ విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. Indian flight IndiGo's Sharjah-Hyderabad flight diverted to Pak's Karachi airport after glitch Read @ANI Story | https://t.co/DsjeybrHvQ#Indigo #Pakistan #India #SharjahHyderabadFlight pic.twitter.com/Iaaw7CyAOw — ANI Digital (@ani_digital) July 17, 2022 ఇది కూడా చదవండి: Metro Trains: మెట్రో ట్రైన్స్ శబ్దాన్ని తగ్గిస్తున్నారు! కారణం?