సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తుంటారు. వారిని మరోసారి తప్పు చేయోద్దని గట్టిగా హెచ్చరిస్తారు. అయితే ఓ పిల్లాడు చేసిన తప్పు మాత్రం ఆ తండ్రికి రూ.7.5 కోట్లు తెచ్చి పెట్టింది. అతడు చేసిన తప్పుకు మొదట తండ్రి కోప్పడ్డా.. తర్వాత అసలు విషయం తెలుసుకుని సంతోష పడ్డాడు. కొడుకో వల్లే తనకు ఇన్ని కోట్లు వచ్చాయంటూ ఆ తండ్రి గర్వంగా చెప్పుకొచ్చాడు. ఇంతకి ఆ కొడుకు చేసిన తప్పు ఏమిటి? తప్పు చేస్తే కోట్లు రావడం ఏమిటి? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అమెరికాలోని మేరీ ల్యాండ్ కు చెందిన ప్రిన్స్ జాన్ ... తన కొడుకును పాఠశాలకు తీసుకుని వెళ్లాడు. సూల్క్ నుంచి తిరిగి వస్తుండగా కొడుకు జాకెట్ ప్రమాదవశాత్తు కారు డోర్ లో ఇరుక్కుపోయింది. దానిని తీసే క్రమంలో అది కాస్తా చినిగి పోయింది. ఆ జాకెట్ ను సరి చేయడానికి సమీపంలోని డ్రై క్లీనర్ వద్దకు వెళ్లారు ప్రిన్స్ జాన్. ఆ జాకెట్ సరిచేయడానికి చాలా సమయం పడుతుందని ఆ డ్రై క్లీనర్.. జాన్ తో అన్నాడు. ఇక అక్కడే ఉండి చేసేది ఏమిలేక పక్కనే షాప్ వద్దకు వెళ్లాడు. అక్కడ లాటరీలు అమ్ముతుండటం గమనించాడు. దీంతో తాను ఒకటి తీసుకోవాలని అనుకున్నాడు. వెంటనే ఒక లాటరీ కొనుగోలు చేసి.. ఇంటికి వచ్చేశాడు. కొన్ని రోజులకు లాటరీ కొన్న విషయమే అతను మరచిపోయాడు. మరికొన్నిరోజుల తరువాత ప్రిన్స్ జాన్ కి.. తాను లాటరీలో డబ్బులు గెలిచినట్లు సమాచారం వచ్చింది. అతను కొనుగోలు చేసిన లాటరీపై జాక్ పాట్ తగలడంతో ప్రిన్స్ షాకయ్యాడు. కొద్ది సేపు ఈ వార్త నిజమా? అనే సందేహంతో ఉండిపోయాడు. అనంతరం కొద్ది సేపటికి తేరుకుని నిజంగానే తనకు లాటరీ తగిలిందని గుర్తించాడు. అది మన కరెన్సీలో రూ.7.5 కోట్లు లాటరీ తగిలిందంట. ఇందంతా తన కొడుకు వల్లనే జరిగిందని ప్రిన్స్ జాన్ అన్నాడు. ఇప్పుడు ఈ లాటరీ తో వచ్చిన డబ్బులతో పిల్లల కాలేజీ ఫీజులు, కుటుంబ అవసరాలు తీర్చుకుంటానని జాన్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తన కొడుకును విహార యాత్రకుతీసుకెళ్తానని తెలిపారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ఒకే ఒక్క లాటరీ టిక్కెట్ కొని రూ.10,588 కోట్ల జాక్పాట్ కొట్టాడు! ఇదీ చదవండి: ఇంతటి అదృష్టవంతుడిని ఎక్కడా చూసుండరు.. 2 గంటల్లో ఇల్లు అమ్మకం.. ఆలోపే లాటరీలో భారీ సొమ్ము!