ఇరుగుపొరుగు ఇండ్లకు, సరిహద్దు దేశాలకు పెద్ద తేడా లేదు. మన ఇంటి చుట్టు పక్కల ఇండ్లు బాగుంటేనే మనకు మనఃశాంతి. మన చుట్టు పక్కల దేశాలు బాగుంటేనే దేశానికి ఆర్థికంగా, భద్రతాపరంగా మంచిది. కానీ, ప్రస్తుతం మన చుట్టూ ఉన్న దేశాల్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు ఇండియాకు తలనొప్పిగా మారాయి. మిత్రదేశమైన శ్రీలంక ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా.. దాయాది దేశం పాకిస్తాన్ సైతం అదే బాటలో పయనిస్తోంది. తాజాగా ఖర్చులను తగ్గించుకోవడానికి టీ తాగొద్దని.. వంట నూనె అతిగా వాడొద్దని ఆ దేశం ప్రజలకు సూచనలిస్తోంది అంటే అర్థం చేసుకోవచ్చు.. ఏ దిశగా పయనిస్తుందో. ఇటీవల శ్రీలంకలో చిచ్చురేపిన ఆర్థిక సంక్షోభం అక్కడి ప్రజల్ని ఎలా అవస్థలకు గురి చేసిందో కళ్లారా చూశాం. పెట్రోల్ కోసం క్యూలైన్లో నిలబడి చనిపోయారనే వార్తలు కూడా వెలువడ్డాయి. తినడానికి తిండిలేక ఆకలికి మలమల మాడి మరింత మంది చనిపోయారు. దొంగతనాలు, లూటీలు నిత్యకృత్యంగా మారాయి. ఈ బాధలు భరించలేక చాలామంది దొంగచాటుగా భారత్ కి వలస వచ్చి శరణార్థులుగా బతికిపోతున్నారు. మరికొంతమంది సముద్ర ప్రయాణంలోనే చనిపోయారు. ఇప్పుడు శ్రీలంక బాటలోనే పాకిస్తాన్ కూడా అవస్థలు పడుతోంది. ఇది కూడా చదవండి: Love Marriage: 64 ఏళ్ల బామ్మను పెళ్లాడిన 24 ఏళ్ల యువకుడు.. పిల్లల్ని కనడం కోసం కోట్లు ఖర్చు! ఇప్పటికే పాకిస్తాన్ లో అన్ని రకాల నిత్యావసరాల వస్తువుల రేట్లు భారీగా పెరిగాయి. పాలు, చక్కెర, టీ పొడి, కూరగాయలు, ఇంధన రేట్లు.. ఇలా అన్నింటి రేట్లు భారీగా పెరిగాయి. దీనికి కారణం ద్రవ్యోల్బణమే. తాజాగా పాకిస్తాన్ కి మరో చిక్కొచ్చిపడింది. కాగితానికి కరువొచ్చింది. కాగితం కొరత కారణంగా కొత్త విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్యపుస్తకాలను కూడా ముద్రించలేమని చేతులెత్తేశారు. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో పాటు విపరీతమైన అప్పుల కారణంగా పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ సంక్షోభం నుంచి కోలుకోవడానికి ఐఎంఎఫ్ సాయం కోరుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఓ విచిత్ర ప్రకటన చేసింది. దేశ ప్రజలు టీ తాగడం తగ్గించాలని, తద్వార దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి సహకరించాలని కోరింది. రోజూ తాగే టీ కప్పుల సంఖ్యను తగ్గించుకుంటే దేశ దిగుమతి ఖర్చులు తగ్గుముఖం పడుతాయని తెలిపింది. ఆంతేకాదు.. వంట నూనె అతిగా వాడొద్దని, పెళ్లిళ్లలో ఒకటి లేదా రెండు వంటలతో సరిపెట్టాలని సూచించింది. అలాగే ఇంధనాన్ని ఆదా చేసే ప్రయత్నంలో భాగంగా రాత్రి 10 గంటల తర్వాత వివాహ కార్యక్రమాలను నిషేధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసిందని వార్తలు ప్రసారమవుతున్నాయి. ఏదేమైనా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్ మన దేశాన్ని సాయం అడిగే సాహసం చేయకపోవచ్చు. ఈ కష్టాల నుండి దాయాది దేశం తొందరగా బయటపడాలని మనమూ కోరుకుందాం. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Teenage Girl: కుబేరుడి సోదరి.. ఒక్క రోజే 40 లక్షలు ఖర్చు చేస్తుంది!