బ్యాంక్ సిబ్బంది చేసే తప్పిదాల వల్లనో.. లేక ఏదైనా సాంకేతికపరమైన ఇబ్బంది వల్లనో అప్పుడప్పుడు కొందరి బ్యాంక్ ఖాతాల్లో భారీ మొత్తం నగదు జమ అవుతూ ఉంటుంది. అకౌంట్లో ఒక్కసారే అంత మొత్తాన్ని చూడగానే ఏదో మిస్టేక్ వల్ల ఇలా జరిగింది అని మనకు అర్థం అవుతుంది. కొందరు వెంటనే బ్యాంక్కు సమాచారం ఇస్తారు. కానీ మరి కొందరు మాత్రం.. ఇలా డబ్బు జమ అయినప్పుడు వెంటనే డ్రా చేసి జల్సాగా ఖర్చు చేస్తుంటారు. అకౌంట్లో పడ్డ డబ్బు వారిది కాదని తెలిసినా.. ఏదో ఓ రోజు బ్యాంక్కు ఈ విషయం అర్థం అయ్యి.. అప్పుడు డబ్బు కట్టమని అడుగుతారని తెలిసి కూడా విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. కానీ బ్యాంకులు ఊరుకోవు. ముక్కుపిండి వసూలు చేస్తాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ మహిళ ఖాతాలో 55 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఆ మొత్తం తన డబ్బు కాదని ఆమెకు తెలుసు. అయినా సరే.. ఆ మొత్తాన్ని వేరే జాయింట్ అకౌంట్కి ట్రాన్సఫర్ చేయడమే కాక.. అందులో 10 కోట్ల రూపాయలు వెచ్చించి విలాసవంతమైన ఇల్లు కట్టింది. కానీ కొన్ని నెలల తర్వాత సదరు కంపెనీ జరిగిన పోరపొటు తెలుసుకుని డబ్బు చెల్లించాల్సిందిగా నోటీసులు పంపింపింది. కోర్టుకు కూడా వెళ్లింది.. చివరకు కోర్టు తీర్పు కంపెనీకి అనుకూలంగా రావడంతో ప్రసుత్తం సదరు మహిళ షాకయ్యింది. ఆ వివరాలు.. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. మెల్బోర్న్ నగరంలో నివసించే తేవామి మణివేల్ నోకరి అనే మహిళ అకౌంట్లో 2021, మే నెలలో అనుకోకుండా 55 కోట్ల 79 లక్షల రూపాయలు వచ్చి పడ్డాయి. అది చూసి సదరు మహిళ సంతోషంతో ఉప్పొంగిపోయింది. తనంత అదృష్టవంతురాలు లేదని పొంగిపోయింది. Crypto.com అనే కంపెనీ చేసిన పొరపాటు వల్ల ఈ తప్పిదం చోటు చేసుకుంది. మణివేల్ ఖాతాకు కోటి 5 లక్షల డాలర్లు జమ చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో 55,79,00, 000 కోట్ల రూపాయలు అన్నమాట. కంపెనీలో పనిచేసే ఓ వ్యక్తి పొరపాటు వల్ల ఇలా జరిగింది అని మీడియా వెల్లడించింది. వేరొకరి అకౌంట్లోకి పంపాల్సిన మొత్తాన్ని పొరపాటున మణివేల్ ఖాతాలో జమ చేసినట్లు తెలిసింది. ఇక తన అకౌంట్లో అంత భారీ మొత్తం చూడగానే ఆశ్చర్యపోయిన మణివేల్.. వెంటనే అందులో భారీ మొత్తాన్ని తన స్నేహితురాలి జాయింట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ మొత్తం నుంచి 10 కోట్ల రూపాయలతో మెల్బోర్న్లో ఓ విలాసమైన ఇంటిని కొనుగోలు చేసింది మణివేల్. దాన్ని తన సోదరి పేరు మీద రిజస్టర్ చేయించింది. అంతేకాక మరో రెండు కోట్ల మొత్తాన్ని స్నేహితురాలి కుమార్తె అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసింది. తన అకౌంట్లో జమ అయిన మొత్తాన్ని వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసింది మణివేల్. ఇక ఏడు నెలల తర్వాత సదరు సంస్థ తాము చేసిన పొరపాటును గుర్తించింది. వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ఆదేశిస్తూ.. 2022, ఫిబ్రవరిలో మణివేల్కు నోటీసులు జారీ చేసింది. అంతేకాక ఆమెమీద చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. ఆమె అకౌంట్ను ఫ్రీజ్ చేసింది. దాంతో పాటు మణివేల్ సోదరి అకౌంట్ను కూడా ఫ్రీజ్ చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో క్రిప్టో సంస్థకు అనుకూలంగా కోర్టు తీర్పు వెల్లడించింది. మొత్తం డబ్బుతో పాటు వడ్డీని, చట్టపరమైన చర్యల ఖర్చును కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాక తప్పుగా జమ అయిన మొత్తంతోనే మణివేల్ ఇంటిని కోనుగోలు చేసినట్లు రుజువు కావడంతో దాన్ని అమ్మి.. ఆ మొత్తాన్ని సంస్థకు కట్టాలని కోర్టు ఆమెని ఆదేశించింది. ఇక డబ్బంతా జల్సాలకు ఖర్చు చేయడంతో.. ఇప్పుడు ఆ మొత్తాన్ని ఎలా తిరిగి చెల్లించాలో అర్థం కాక తలపట్టుకుంది మణివేల్. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: 217 మంది అమాయకుల ప్రాణాలు తీసిన నరహంతకుడికి విడుదల! ఇది కూడా చదవండి: తన విడాకుల పార్టీలో పరిచయమైన వెయిటర్ ను పెళ్లాడిన మహిళ!