సమాజంలో ఓ వ్యక్తి ఉంటాడు. అతడు సాధరణ మనిషి. తన పనేదో తాను చేసుకుంటాడు. కానీ ఇంతలో అతని ఇంటిపై ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తుంది. దాంతో ఒక్కసారిగా అతను ఆ ఏరియాలో హాట్ టాపిక్ గా మారతాడు. సోదాల్లో అతనికి వేల కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదంతా వింటుంటే మీకు ఏదో సినిమాల స్టోరీలా అనిపిస్తోంది కదూ. నిజమే అలా అనిపించడం సహజమే. కానీ ఇప్పుడు చెప్పబోయే స్టోరి వింటే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. సమాజంలో ఉన్న ప్రతీ వ్యక్తికి ప్లాష్ బ్యాక్ ఉంటుంది. కొందరికి మాత్రం 'బాషా' మూవీలో రజినీకాంత్ కు ఉన్నంత ప్లాష్ బ్యాక్ ఉంటుంది. అతని గతం తెలినంత వరకు అతడు ఆటో డ్రైవర్ కిందే లెక్క. ఒక్కసారి అతడి గతం తెలిశాక అందరి చూపూ అతడి వైపే. తాజాగా ఓ వ్యక్తి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఒక్కటే పేరు వినిపిస్తోంది. అదే చికోటీ ప్రవీణ్ కుమార్.. అసలు ఎవరీ చికోటి ప్రవీణ్ కుమార్.. 20ఏళ్ల క్రితం ఓ చిన్న సిరామిక్ టైల్స్ నిర్వహించేవాడు. అతడు హైదరాబాద్ లోని సైదాబాద్, వినయ్ నగర్ కాలనీలో అతని నివాసం. వ్యాపారంలో కొంత డబ్బు కూడ బెట్టాక సినీ నిర్మాతగా మారాడు. దాంతో చేతులు కాల్చుకుని అప్పుల ఊబిలో చిక్కుకు పోయాడు. ఆ టైమ్ లో ఓ వైద్యున్ని కిడ్నాప్ చేసి జైలుకు సైతం వెళ్లాడు. తర్వాత తన మకాం గోవాకు మార్చాడు ప్రవీణ్. అక్కడ కేసినోలో కొన్ని టేబుళ్లను లీజుకు తీసుకున్నాడు. దాంతో అతని కేసినో ప్రస్థానం మెుదలైంది. అలా మెుదలైన అతని చీకటి ప్రస్థానం దాదాపు 10 దేశాల్లో విస్తరించింది అంటేనే అతని సామ్రాజ్యం ఎంత ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. అతడు 'బిగ్ డాడీ' పేరుతో నేపాల్.. శ్రీలంక.. ఇండోనేషియా.. థాయిలాండ్ తదితర దేశాల్లో క్యాసినో నిర్వహించేవాడు. ఇటీవల తన పుట్టిన రోజును భారీగా నిర్వహించగా.. దానికి తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ తారలు కూడా హాజరైయ్యారని వినికిడి. ఏపీలో ఆ మధ్య నిర్వహించిన భారీ క్యాసినో వెనుక ప్రవీణ్ హస్తం ఉందని చెబుతారు. అలాగే విదేశాల్లో జరిగే క్యాసినోలకు ప్రముఖులను ప్రత్యేక హెలికాప్టర్లలో తరలించేవాడు. ఇదీ చూస్తూనే అతని రేంజ్ ఏపాటిదో అర్థం అవుతోంది. రెండు రాష్ట్రాల్లోని సుమారు16 రాజకీయ నాయకులతో ప్రవీణ్ కు మంచి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈడీ సోదాల్లో వినిపిస్తోన్న మరో పేరు మాధవరెడ్డి. కొన్నేళ్ల క్రితం పాలు.. పెరుగు అమ్ముతూ సాదాసీదా జీవితాన్ని గడిపిన అతడు ఈ రోజు కోట్లకు పడగలు ఎత్తాడు. ఈ మధ్యనే నిర్వహించిన బోనాల సందర్భంగా దాదాపు కేజీ బరువున్న బంగారు ఆభరణాలు ఒంటి మీద వేసుకోవటం.. బౌన్సర్లను పెట్టుకొని తిరగటం చూసిన స్థానికులు అతడి రేంజ్ ఎంతలా పెరిగిపోయిందో? అన్న చర్చ స్థానిక జనాల్లో జరుగుతోంది. ఇతని కారుమీద తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కారు స్టిక్కర్ ఉండటం గమనార్హం. ఈ క్రమంలో చికోటి ప్రవీణ్ కుమార్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. సోమవారం కార్యలయానికి రావాలని తెలిపింది. ప్రవీణ్ కూడా స్పందిస్తూ.. తాను తప్పకుండా హాజరు అవుతానని కొన్ని మీడియా ఛానెల్స్ కు చెప్పాడు. మరి ఇంతటి సామ్రాజ్యన్ని మూడో కంటికి తెలికుండా నడిపిస్తోన్న చికోటి ప్రవీణ్ కుమార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: దివంగత నటుడికి అవమానం! బాయ్ కాట్ ఫ్లిప్ కార్ట్ అంటూ! ఇదీ చదవండి: ప్రభాస్ ప్రాజెక్ట్ K.. అవెంజర్స్ మూవీలను తలపిస్తుంది: నిర్మాత అశ్వినీదత్