ప్రేమిస్తున్నానని నమ్మించిన ఓ యువకుడు డిగ్రీ చదివే యువతికి శారీరకంగా దగ్గరై గర్భవతిని చేశాడు. ఇక ఈ దారుణంతో సరిపెట్టకుండా అబార్షన్ కు కోసమని ప్రియుడిచ్చిన మాత్రలు తిన్న ప్రియురాలు చికిత్స పొందుతూ ఇటీవల మరణించింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పుసుగుడెంకు చెందిన భూక్యా నందు అనే యువకుడికి ములకలపల్లి మండలం వీకే రామవరం గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతోనే నందు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఇతగాడి ప్రేమకు కరిగిపోయిన ఆ యువతి అతని మాయలో పడి నందుకు దగ్గరైంది. ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు యువతిని నమ్మించి అనేక సార్లు శారీరకంగా దగ్గరయ్యాడు. ఇలా అనేక సార్లు వాళ్లిద్దరూ శారీరకంగా కలుసుకోవడంతో ఆ యువతి 5 నెలల గర్భవతి అని తెలిసింది. దీంతో షాక్ కు గురైన ఆ యువకుడు మాత్రలు వేసుకోమని ఇచ్చాడు. అయినా ఆ యువతికి అబార్షన్ కాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఈక్రమంలోనే తన ప్రియురాలికి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో ప్రియుడు మరో యువతి సహకారంతో జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలో సడెన్ గా ఆమెకు ఫిడ్స్ రావడంతో ఆ యువతి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న నందు, అతనితో పాటు వచ్చిన మరో యువతి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక వైద్యులు చికిత్స చేస్తుండగా ఆ యువతి పరిస్థితి విషమించడంతో చివరికి ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న పోలీసులు ఇదే విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చేరవేశారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఆ యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చనిపోయిన ఆ అమ్మాయిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. యువతి మరణానికి కారణమైన నందుపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల చోటు చేసుసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: హైదరాబాద్లో దారుణం.. ప్రిన్సిపాల్ గదిలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థి!