Liger: టాలీవుడ్ నుండి ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ. తెలుగుతో పాటు విజయ్ పేరు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. త్వరలోనే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఆగష్టు 25న రిలీజ్ కాబోతున్న లైగర్ సినిమాకు సంబంధించి ఇటీవలే ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. అదికూడా ట్రైలర్ తోనే ప్రమోషన్స్ ప్రారంభించడం విశేషం. ఇదిలా ఉండగా.. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ తో లైగర్ టీమ్ అందరూ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేశారట. ఓవైపు ప్రమోషన్స్ చేస్తూనే మరోవైపు బాలీవుడ్ టాక్ షోలలో సైతం పాల్గొంటున్నాడు విజయ్. ఇటీవల ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' షోలో లైగర్ హీరోయిన్ అనన్య పాండేతో కలిసి ప్రత్యక్షమయ్యాడు. తాజాగా విజయ్.. లైగర్ నిర్మాతలలో ఒకరైన ఛార్మీతో కలిసి డ్రింక్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్.. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. స్పోర్ట్స్ యాక్షన్ జానర్ లో రూపొందిన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా మారబోతున్నాడు. మరి ఇప్పటికే సినిమాకి బజ్ చాలా క్రియేట్ చేశారు. ఇక థియేటర్లో సందడి ఎలా ఉండబోతుందో చూడాలి. విజయ్ లైగర్ తో పాటు ఖుషి సినిమా కూడా చేస్తున్నాడు. మరి విజయ్ దేవరకొండ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur)