ఈ మద్య సెలబ్రెటీలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖలు, కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కొత్తగా పెళ్లైన బాలీవుడ్ జంటకు చంపుతానంటూ సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి హెచ్చరిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వార్తలు కాస్త బాలీవుడ్ లో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన ప్రియుడు విశాల్ కౌశల్ ని గతేడాది డిసెంబర్ 9న వివాహం చేసుకోవడం తెలిసిందే. ఇటీవల ఈ జంట మళ్లీ పలు సినిమాల్లో నటించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ ద్వారా తమను బెదిరిస్తున్నట్టు, బెదిరింపు ఇమేజ్ లను పోస్ట్ చేస్తున్నాడంటూ విశాల్ కౌశల్.. శాంతాక్రజ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఈ విషయంపై ఎలాంటి ధృవీకరణ లేదు. ఇటీవలే మాల్దీవుల్లో ఈ జంట విహరించి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట పలు సినిమాల షెడ్యూళ్లతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల సెలబ్రెటీలకు బెదిరింపు కాల్స్ రావడం.. వెంటనే పోలీసులు అలర్ట్ కావడం చూస్తూనే ఉన్నాం. చాలా వరకు అవి ఫేక్ కాల్స్.. కొంత మంది ఆకతాయిలు చేస్తున్నవని పోలీసులు అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Maharashtra | Police register a case against an unidentified man and initiate an investigation for allegedly giving life threats to actors Katrina Kaif and Vicky Kaushal through social media. Case registered at Santacruz Police Station: Mumbai Police (File photos) pic.twitter.com/hQTaTMnB9a — ANI (@ANI) July 25, 2022 ఇది చదవండి: ఆ విషయంలో భయపడ్డాను.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా : స్టార్ హీరో