మెగాకోడలు ఉపాసన మరోసారి మంచి మనసు చాటుకున్నారు. తన ఇంట్లో పనిచేసే ఓ పర్సన్ అడిగాడని... ఏకంగా స్కూల్ కట్టిస్తానని మాటిచ్చారు. మాటివ్వడమే కాదు దాన్ని నిజం చేసి చూపించారు. ఈ విషయమై ఉపాసనని.. మెగా అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉపాసన అనగానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్ పర్సన్ అని మనలో చాలామందికి తెలుసు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె.. వీలు తోచినప్పుడల్లా తన వంతు సాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సాయం, ఇంకా చెప్పాలంటే అంతకుమించి చేశారు. ఉపాసన ఇంట్లో లక్ష్మణ్ అనే వ్యక్తి ఎన్నో ఏళ్ల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నారు. ఓసారి మాటల సందర్భంగా.. బస్తీలో పిల్లల కోసం స్కూల్ కట్టించడానికి రెడీగా ఉన్నానని ఉపాసన అన్నారు. అప్పుడు చెప్పినట్లుగానే మాట మీద నిలబడ్డారని, అపోలో ఫౌండేషన్ ద్వారా త్వరలో స్కూల్ కట్టించబోతున్నారని లక్ష్మణ్ తెగ ఆనందపడుతూ చెప్పాడు. తాజాగా ఆ బస్తీలో వినాయక చవితి వేడుకకు అతిథిగా వచ్చిన మెగా కోడలు ఉపాసన.. స్కూల్ కట్టే విషయమై మీడియాతో మాట్లాడారు. లక్ష్మణ్.. తమ ఇంట్లో ముఖ్యమైన వ్యక్తని చెప్పిన ఉపాసన.. అతడికి కావాల్సిన సాయం చేసేందుకు తన ఎప్పుడు సిద్ధంగా ఉంటానని అన్నారు. మరి బస్తీలో పిల్లల కోసం ఉపాసన చేస్తున్న మంచి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి. ఇది కూడా చదవండి: మంచి మనసు చాటుకున్న మెగా కోడలు ఉపాసన.. ఇక వారికి అపోలో ఆస్పత్రిలో ఉచిత వైద్యం!