ట్విట్టర్లో గత కొన్ని రోజులుగా అనసూయకి, నెటిజన్లకి మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతకాలం నెటిజన్లు మారతారేమో అన్న ఉద్దేశంతో సహనంతో భరిస్తూ వచ్చిన ఆమె.. చివరకి పోలీసులకు ఫిర్యాదు చేయక తప్పలేదు. సైబర్ క్రైమ్కి ఫిర్యాదు చేసినట్లు ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఏజ్ షేమింగ్ పేరుతో ఆమెను మానసికంగా వేదనకు గురి చేస్తున్నారన్న కారణంగా ఆమె ఈ కంప్లైంట్ చేశారు. ఆన్లైన్ అబ్యూజింగ్ని ఆపమని ఆమె మొదటి నుంచి మొత్తుకుంటున్నా మాట వినకపోగా.. ఆంటీ అంటీ అంటూ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అసభ్యపదజాలంతో ఆమెపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఆమె సహనాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సైబర్ క్రైమ్లో హెరాస్మెంట్ కేసు పెట్టానని, అది సక్సెస్ఫుల్గా రిపోర్ట్ అయ్యిందని ఒక స్క్రీన్ షాట్ను షేర్ చేశారు. "ప్రక్రియ మొదలవుతుంది. యువకుల భవిష్యత్తు కోసం ఆలోచించి చాలా టైమ్ ఆగాను. కానీ ఇదీ జరిగింది. అందుకే ఫిర్యాదు చేశాను. వెంటనే సపోర్ట్ చేసి యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులకు ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశారు. దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. And the process begins Took my time to not do this to save the future of a lot of impulsive youth/people..but looks like what has to be done..should be done..thanking the cyber crime officials for being very supportive prompt and promising#SayNoToOnlineAbuse #StopAgeShaming pic.twitter.com/gxBinHkG8X — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 29, 2022 ఇది కూడా చదవండి: ‘ఆంటీ అన్నందుకు సారీ అను’.. నెటిజన్ క్షమాపణలకు అనసూయ రిప్లై ఏంటంటే? ఇది కూడా చదవండి: వీడియో: తనని తిట్టిన థియేటర్ ఓనర్ ని కలిసిన విజయ్ దేవరకొండ!