అసలు పేరు ఉప్పలపాటి కృష్ణంరాజు.. కానీ అభిమానులు ఆయనకు పెట్టుకున్న ముద్దు పేరు రెబల్ స్టార్. వందలాది చిత్రాల్లో నటించి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు కృష్ణంరాజు. ఇక రీల్ మీద హీరోగా మాత్రమే కాక.. రియల్గా కూడా మంచి మనసున్న మారాజుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణంరాజు మృతితో ఆయన కుటుంబంలోనే కాక ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. ఇక సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణించారు కృష్ణంరాజు. 1991 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లో ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచి ఓడిపోయారు. ఆ తరువాత ఆయన బీజేపీలో చేరారు. అది ఆయనకు రాజకీయంగా కలిసి వచ్చింది. ఈ క్రమంలో1998 సంవత్సరం జరగిన ఎన్నికల్లో కృష్ణంరాజు బీజేపీ తరఫున కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీచేసి భారీ అధిక్యంతో గెలుపొందారు. అయితే విజయం సాధించినప్పటికి ఆయన ఏడాది కాలం మాత్రమే కాకినాడ ఎంపీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ ఆధిక్యంతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఇక రెండో సారి కూడా ఎంపీగా విజయం సాధించడంతో ఆయనను కేంద్రమంత్రి పదవి వరించింది. 2000 నుంచి 2004 వరకు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2004 లోక్సభ ఎన్నికల్లో తిరిగి నరసాపురం నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఆ తర్వాత కొంత కాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అనంతరం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో.. కృష్ణంరాజు తిరిగి 2013లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి కాషాయ పార్టీతో మంచి సంబంధాలు కొనసాగించారు కృష్ణంరాజు. ఈ క్రjpమంలోనే ఆయనకు గవర్నర్ పదవి దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగింది. కేంద్రమంత్రిగా పని చేసినప్పటికి.. గవర్నర్ హోదాలో బాధ్యతలు నిర్వహించాలనే కోరిక కృష్ణంరాజుకు బలంగా ఉండేదని ఆయన సన్నిహితులు చెబుతారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల తరువాత నరేంద్ర మోదీ రెండో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కృష్ణంరాజుకు గవర్నర్ పదవి ఇస్తారని.. తమిళనాడు గవర్నర్గా నియమిస్తారని జోరుగా ప్రచారం సాగింది. అంతేకాక మోదీ రెండో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కృష్ణంరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయనతో సమావేశం అయ్యారు. దాంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయ్యింది. కానీ ఆ తర్వాత కృష్ణంరాజు రాజకీయాలకూ పూర్తిగా దూరమయ్యారు. గవర్నర్ పదవిపై కూడా పెద్దగా ఆసక్తి చూపలేదని ఆయన సన్నిహితులు తెలిపారు. అందుకు దాని గురించి ఎప్పుడు చర్చకు కూడా రాలేదని అన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Syamala Devi Uppalapati (@usyamala) ఇది కూడా చదవండి: టాలీవుడ్ ‘మర్యాద రామన్న’ కృష్ణంరాజు .. ప్రభాస్ కూడా సేమ్ అలానే ఇది కూడా చదవండి: తమ్ముడి కొడుకులా కాదు.. కన్న కొడుకులా! ప్రభాస్ అంటే కృష్ణంరాజుకి అంత ఇష్టం!