దక్షిణ భారత దేశంలోని సినీ ఇండస్ట్రీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా అవార్డుల పండగ సైమా వేడుకను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ వస్తుంది. సైమా సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డ్స్ పది సంవత్సరాల క్రితం అంటే 2012లో ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా సైమా అవార్డు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. 2021 గాను దక్షిణాదికి చెందిన నాలుగు భాషల సినిమాలకు సంబంధించి నామినేషన్స్ను ప్రకటించింది. ఈ అవార్డ్స్ లో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’, బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమాలు ఎక్కువగా నామినేషన్స్ దక్కించుకున్నాయి. సినీ రంగంలతో 24 క్రాప్ట్స్ లోని టాలెంట్ కనబరిచిన నటులు, టెక్నీషియన్స్కు ఈ అవార్డులు ప్రకటిస్తారన్న విషయం తెలిసిందే. అంతే కాదు సీనియర్ నటులు, ఇండస్ట్రీకి పలు సేవలు చేస్తూ వచ్చిన వారికి సత్కారాలు కూడా చేస్తారు. ఈసారి సైమాలో టాలీవుడ్ కి సంబంధించిన సినిమాలు సత్తా చాటాయి. ఇక నామినేషన్ల విషయానికి వస్తే.. 2021 గాను ‘ఫుష్ప’ సినిమాకు 12 నామినేషన్స్ దక్కినట్లు తెలుస్తుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’సినిమాకు 10 విభాగాల్లో నామినేషన్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. జాతి రత్నాలు ఉత్తమ కమెడియన్తో పలు విభాగాల్లో 8 నామినేషన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ సినిమా ఉత్తమ నూతన నటీనటులుగా విలన్ గా 8 నామినేషన్స్ దక్కించుకున్నట్టు సమాచారం. ఈ మూవీతో కన్నడ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇది చదవండి: నటి స్నేహ ఇంట్లో వరలక్ష్మీ పూజ! హాజరైన రంభ, శ్రీదేవి ఇది చదవండి: మహేష్ కోసం ‘KGF టీమ్’ని బరిలోకి దింపనున్న త్రివిక్రమ్..?