నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలు, సినిమా కోసం ఎలాంటి ప్రయోగానికి అయినా సిద్ధపడే అతికొద్ది మంది టాలీవుడ్ నటుల్లో హీరో శర్వానంద్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. క్రమంగా హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ అమల కీలక పాత్రలో కనిపిస్తుంది. వీరే కాక వెన్నెల కిశోర్, రాహుల్ ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా శర్వానంద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తరుణ్ భాస్కర్కిచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్గా మారింది. ఆ వివరాలు.. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. ‘‘పడిపడిలేచె మనసు సినిమా మంచి విజయం సాధిస్తుందని భారీ నమ్మకంతో ఉన్నాను. కానీ అనుకోకుండా ఆ సినిమా ప్లాఫ్ అయ్యింది. అది నాకు ఊహించని దెబ్బ. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. 2,3నెలలు నా గది దాటి బయటకు రాలేదు. ఆ రిజల్ట్ అస్సలు ఊహించలేదు. అలానే నా కెరీర్లో భారీ డిజాస్టర్గా నిలిచిన మరో చిత్రం కో అంటే కోటి. మా అమ్మ బంగారం తీసుకుని మరి ఆ సినిమా తీశాం. నేనే నిర్మాతగా వ్యవహరించాను. కానీ సినిమా దారుణంగా ప్లాఫ్ అయ్యింది. డబ్బులు పోయాయి. బంధాలు దూరమయ్యాయి. తట్టుకోలేకపోయాను. ఆ అప్పులు తీర్చేందుకు ఆరేళ్లు పట్టింది. ఆ 6 సంవత్సరాలు కనీసం ఒక్క షర్ట్ కూడా కొనలేదు’’ అని నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నాడు శర్వానంద్ ‘‘ఇక తర్వాత వచ్చిన రన్ రాజా రన్ సినిమా మంచి విజయం సాధించింది. అప్పుడు ప్రభాస్ అన్న పిలిచి వాళ్ల ఇంట్లో పార్టీ ఇచ్చాడు. నాకేమో నిజంగానే నా సినిమా హిట్టయ్యిందా అనే డౌట్లోనే ఉన్నాను. ఎక్స్ప్రెస్ రాజా సినిమా హిట్ అయినప్పుడు కూడా పార్టీకి పిలిచారు. కానీ నేను సోమవారం దాకా నమ్మను అని చెప్పాను. అలా సినిమాల సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయలేకపోయాను అని వెల్లడించాడు శర్వానంద్. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: అమల మూవీ చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున! ఇది కూడా చదవండి: దటీజ్ శర్వానంద్.. అభిమానికి గిఫ్ట్గా తనకు ఇష్టమైన జాకెట్ ఇచ్చాడు!