కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత దేశంలో ఇప్పుడిప్పుడే సినిమా రంగం పుంజుకుంటోంది. ఏపీలో మాత్రం సినిమా ఇంకా పట్టాలెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. టికెట్ రేట్ల విషయంలో ఇంకా చర్చలు, వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. టికెట్ రేట్లు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయడం. దానిపై థియేటర్స్ యజమానులు కొందరు కోర్టుకు వెళ్లడం. పిటీషన్ వేసిన వారికి మినహాయింపు ఇవ్వడం. తర్వాత ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్లలో సౌకర్యాలపై దృష్టి పెట్టి దాడులు చేయడం. కొన్ని థియేటర్లను మూసివేయడం కూడా జరిగింది. దీనిపై స్పందిస్తూ చాలా థియేటర్లను స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. టికెట్ రేట్ల విషయంలో ఒక స్పష్టత వస్తేనే థియేటర్లు తెరుచుకుంటాయనే పరిస్థితులు ఉన్నాయి. దీనిపై తాజాగా నటుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. @ysjagan Sirr.. andhariki varalu isthunnaru.. papam theatre owners ki.. cinema vaallaki help cheyyandi.. itlu Mee nanna gari abhimaani https://t.co/wUV2yGzHUG — Brahmaji (@actorbrahmaji) December 22, 2021 తెలంగాణలో కారు పార్కింగ్ రేటు రూ.30 ఉన్న ఫొటో ఒకటి.. కంకిపాడులోని థియేటర్లలో సినిమా టికెట్ రేటు బాల్కని-రూ.20, ఫస్ట్ క్లాస్-రూ.15, సెకెండ్ క్లాస్-రూ.10గా ఉన్న ఒక ఫొటోను షేర్ చేసిన ట్వీట్ ను బ్రహ్మాజీ రీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వైఎస్ జగన్ సార్.. అందరికీ వరాలు ఇస్తున్నారు. పాపం థియేటర్ ఓనర్స్ సినిమా వాళ్లకి హెల్ప్ చేయండి. ఇట్లు మీ నాన్నగారి అభిమాని’ అంటూ బ్రహ్మాజీ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్రహ్మాజీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ గడ్డు కాలంలో ఓ రెండు మంచి మాటలు రాసి జనాల్ని థియేటర్కి రప్పించండి లేకపోతే రివ్యూ రాయడానికి సినిమాలు ఉండవు సినిమా చూడడానికి థియేటర్స్ ఉండవు సేవ్ సినిమా సేవ్ థియేటర్స్ థాంక్యూ — Brahmaji (@actorbrahmaji) July 30, 2021