శేఖర్ మాస్టర్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు ఇది. టాలీవుడ్ ప్రముఖ కొరియ గ్రాఫర్లలో ఆయన ఒకరు. ఆయనే డ్యాన్స్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరితో శేఖర్ మాస్టర్ పనిచేశారు. సినిమాలతో పాటు పలు బుల్లితెర షోల్లో పాల్గొన్ని తనదైన కామెడీతో అలరించారు. తాజాగా ప్రభాస్, అనుష్కలపై శేఖర్ మాస్టర్ ఆసక్తిక కామెంట్స్ చేశారు. వారిద్దరికి.. తానే డ్యాన్స్ నేర్పించానని శేఖర్ మాస్టర్ అన్నారు. ఓ ఇంటర్యూలో పాల్గొన్న సమయంలో తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఏ పని ఇచ్చిన నూటికి నూరు శాతం ఆ పని చేయాలని తనకు ఉండేదని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు. ఇంకా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.." నేను డ్యాన్సర్ గా ఉన్న సమయంలో మాస్టర్స్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఎప్పుడు భావించేవాడిని. ఆంతే కాకా నేను కొరియోగ్రాఫర్ మారిన తరువాత తర్వాత డ్యాన్సర్ గా చేయడానికి లేదు. అయితే కొరియో గ్రాఫర్ గా చేసిన వాళ్లు చేస్తే అదే పనిచేయాలి లేదా వేరే పని చూసుకోవాలి. ఇకపోతే నాకున్న వర్క్ నేను సరిగ్గా చేసుకుంటే చాలు అని నేను భావిస్తున్నాను. నా వర్క్ లో ఎవరూ వంకలు పెట్టకూడదని నేను భావించేవాడిని. నా కెరీర్ కు బ్రేక్ అంటే సుధీర్ బాబు హీరోగా నటించిన శివ మనసులో శృతి(ఎస్.ఎం.ఎస్) సినిమానే. అంతేకాదు జులాయి,బాద్ షా సినిమాలతో కొరియోగ్రాఫర్ గా నాకు మంచి పేరు వచ్చింది. ఇకపోతే ఏ సాంగ్ ఇచ్చినా నేను చేయగలనని దర్శకులు నమ్ముతారు. శేఖర్ మాస్టర్ వెల్లడించారు. కాగా రామ్ కు డ్యాన్స్ క్లాసులు చెప్పడానికి వెళ్లేవాడిని. ప్రభాస్ గారికి కూడా డ్యాన్స్ క్లాసులు చెప్పాను" శేఖర్ మాస్టర్ వెల్లడించారు. ఇకపోతే తాను ఇన్స్టిట్యూట్ పెట్టుకున్న తర్వాత అనుష్కకు డ్యాన్స్ నేర్పించానని శేఖర్ మాస్టర్ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. మరి.. శేఖర్ మాస్టర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: 2022లో డబ్బింగ్ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ ని టచ్ చేయలేకపోయిన బాలీవుడ్! ఇదీ చదవండి: తారక్ని ఇండస్ట్రీలో నిలబెట్టడానికి హరికృష్ణ ఇంత చేశారా? అశ్వినీ దత్ బయటపెట్టిన నిజాలు!