ఓంకార్.. బుల్లితెర ప్రేక్షకులకు ఈయన గురించి సెపరేట్ ఇంట్రడక్షన్లు ఏం అవసరం లేదు. ఈయన చేసిన షోల వల్ల ఇండస్ట్రీలో ఎంతో మందికి గుర్తింపు, స్థానం దక్కింది. ఆట అనే డాన్సింగ్ షోతో ఎంతో మంది కొరియోగ్రాఫర్లను, డాన్సర్లను పరిచయం చేశారు. ఆట షో వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. వారిలో ఆట సందీప్ కూడా ఒకరు. అయితే ఇటీవల ఆట సందీప్ భార్య ఓంకార్ మీద చేసిన కామెంట్స్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఆట కార్యక్రమం పేరే సందీప్ ఇంటి పేరుగా మారిపోయింది. అలాంటిది ఆట సందీప్ భార్య ఓంకార్ పై అలాంటి కామెంట్స్ చేయడంతో పెద్దఎత్తున చర్చ మొదలైంది. ఆమె ఎందుకు అలా మాట్లాడింది. అసలు అలా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని. ఆట కార్యక్రమంతో ఎంతోమంది వెలుగులోకి వచ్చిన మాట వాస్తవమే. కానీ, ఎవ్వరూ ఇప్పుడు సరైన పొజిషన్ లో లేరు. ఇండస్ట్రీలో అవకాశాలు లేవు అనేది వారి వాదన. ఇదీ చదవండి: ఓంకార్పై సంచలన కామెంట్స్ చేసిన ఆట సందీప్ భార్య మరోవైపు ఆట తరహాలో వచ్చిన ఢీ డాన్స్ షో ఎంతో సక్సెస్ అయ్యింది. అంతేకాకుండా ఢీ షోలో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు పెద్దపెద్ద కొరియోగ్రాఫర్లు కూడా అయ్యారు. కానీ, ఆటతో పేరు తెచ్చుకున్న వాళ్లు ఇప్పటికీ అలాగే ఉండిపోయారనే భావన వచ్చేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. ఓంకార్ అయినా తమ్ముళ్లకు అవకాశాలు ఇవ్వాలిగా అని జ్యోతిరాజ్ సూటి ప్రశ్న సంధించారు. ఓంకార్ డైరెక్టర్ గా మారి సినిమాలు తీస్తున్నా ఆట నుంచి వచ్చిన ఎవరికీ అవకాశాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సినిమా అనేది ఒకరి చేతులో ఉండే విషయం కాదని.. ఓంకార్ ఒక్కడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదని మరికొందరు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: చరణ్ సినిమా షూటింగ్ను అడ్డుకున్న బీజేపీ నేతలు.. ఎందుకంటే? ఇదీ చదవండి: RRR ఇంటర్వెల్ సీన్ పవర్! కొమరం భీం గణేష్ విగ్రహాలు రెడీ!