Prudhvi Raj: ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ!’ డైలాగ్తో తెలుగులో ఓరేంజ్ పాపులారిటీ తెచ్చుకున్నారు నటుడు పృథ్వీరాజ్. డైలాగ్ పేరునే తన పేరులో చేర్చుకుని ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ’గా మారిపోయారు. కమెడియన్గా మంచి ఫాంలో ఉన్న టైంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున పని చేశారు. వైఎస్సార్ సీపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎస్వీబీసీ ఛైర్మన్గా బాధత్యలు చేపట్టారు. కానీ, ఓ వివాదం కారణంగా పార్టీనుంచి సస్పెండ్ అయ్యారు. ఇక ఆ తర్వాతినుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైఎస్సార్ సీపీలో ఉన్నపుడు చిరంజీవి, పవన్లపై తీవ్రమైన విమర్శలు చేసి.. సినిమాల్లో సరైన అవకాశాలు లేక ఇబ్బందుల పాలవుతున్నారు. ఇటు రాజకీయాల్లోనూ.. అటు సినిమాల్లోనూ అవకాశాలు లేక రెంటికి చెడ్డ రేవడిలా మారారు. తాజాగా, పృధ్వీరాజ్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. తన పరిస్థితి దారుణంగా మారటానికి గల కారణాలు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ సీపీపై సంచలన కామెంట్లు చేశారు. వైసీపీని ఉగ్రవాద శిక్షణా కేంద్రంగా పేర్కొన్నారు. షోలో పృధ్వీరాజ్ మాట్లాడుతూ.. ‘‘ నన్ను ఒకతను కూర్చోబెట్టి బ్రేయిన్ వాష్ చేశాడు. పాకిస్తాన్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినట్లు మైండ్ మొత్తం పొల్యూట్ చేశాడు. అందుకే వైఎస్సార్ సీపీలో చేరా. అహంకారం, మదం, కొవ్వు పట్టినట్లుగా మనమే టాప్ అన్నట్లుగా మాట్లాడేశాను. ఆ రోజు ఉన్నది పృధ్వీరాజ్ కాదు.. మూర్ఖుడు. మూర్ఖుడిగా ఉండిపోయాను. చంద్రబాబుగారిని తిట్టాను. ఇండస్ట్రీలో ఉండి చిరంజీవి, పవన్లను తిట్టాను. వాళ్లు నన్ను హార్ట్ఫుల్గా తీసుకుని వదిలేశారు. లేకుంటే పృధ్వీరాజ్ వెళ్లిపోయి మూడేళ్లు అయిఉండేది. అప్పుడు ఉన్నది పృధ్వీరాజ్ కాదు.. అపరిచితుడు విక్రమ్.. ఇంకో క్యారెక్టర్గా అక్కడికి వెళ్లాను. నా పరిస్థితి ఎలా అయిందంటే.. తొమ్మిది నెలలకు బిడ్డ పుడుతుందంటే.. మూడు నెల్లకే అబార్షన్ చేసి పంపేశారు’’ అని అన్నారు. మరి, వైఎస్సార్ సీపీపై పృధ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Raimohan Parida: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ నటుడు..!