చిత్ర పరిశ్రలో వారానికి పదుల సంఖ్యలో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలపైనే ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఒక మూవీనే తెలుగు పరిశ్రమలోనే కాక దేశ వ్యాప్తంగా భారీ బజ్ ను క్రీయేట్ చేసింది. ఆ చిత్రమే‘లైగర్’. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు విశేషమైన స్పందన వస్తోంది. యూట్యూబ్ లో రికార్డులు క్రీయేట్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంది. అయితే తాజాగా ట్రైలర్ రిలీజ్ వేడుకలో హీరో విజయ్ దేవరకొండ పలు ఆసక్తికరమైన విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. మరి ఆ విశేషాల్లోకి వెళితే.. లైగర్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ. హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కనిపించబోతున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ వేడుకను గురువారం హైదరాబాద్ లోని ప్రముఖ థియేటరైన సుదర్శన్ థియేటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న హీరో విజయ్ మాట్లాడుతూ..'' ఈ రోజు మీ అందర్ని ఇక్కడ చూస్తూంటే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నా సినిమా వచ్చి రెండేళ్లు అయింది. అదీ పెద్ద చెప్పుకునే మూవీ కాదు. నా కుటుంబం గురించి తెలిదు. అయినా, ఈ రోజు ట్రైలర్ కు మీ నుంచి వస్తోన్న ఆదరన చూస్తుంటే ఏం చెప్పాలో తెలియట్లేదు. లైగర్ మూవీని మీకే అంకితం ఇస్తున్నా. మీ కోసమే ఆ బాడీ పెంచా.. అలాగే డాన్స్ లంటే నాకు చిరాకు, కానీ మీ కోసమే చేశా! మీరందరూ గర్వంగా ఫీలవ్వాలనే అంత కష్టపడ్డా. ఆగస్టు 25న థియేటర్లు అన్నీ నిండిపోవాలి. ఆ రోజు ఇండియా మెుత్తం షేక్ అవుతుంది.''అని అన్నారు. అనంతరం చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..'' నేనే లైగర్ గురించి చెప్పడం లేదు. కేవలం విజయ్ గురించే చెబుతున్నా. ఇండస్ట్రీ లో విజయ్ పేరు గొప్పగా వినిపించబోతోంది. ఈ చిత్ర నిర్మాణంలో కరణ్ జోహార్ మాకెంతో అండగా నిలిచారు. అలాగే ఆయన్ని ఇక్కడికి పిలిచింది ట్రైలర్ చూపించడానికి కాదు. సినిమా పై మన తెలుగు వాళ్లకు ఉన్న ప్రేమను చూపించడానికి. ఆగస్టు 25న అదరగొట్టేద్దాం''అని తెలిపారు. మరి దేశవ్యాప్తంగా ఇంత బజ్ ని క్రీయేట్ చేస్తోన్న లైగర్ చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Geetha Krishna: కాస్టింగ్ కౌచ్ పై స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు! ఇదీ చదవండి: Kichcha Sudeep: క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో కిచ్చా సుదీప్!