ఈ మద్య వరుసగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారు.. వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. నందమూరి కుటుంబలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నాల్గవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. దీంతో.. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఊహించని పరిణామంతో నందమూరి కుటుంబంతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. భువనేశ్వరి - బ్రాహ్మణి సైతం ఉమామహేశ్వరి ఇంటి వద్దకు చేరుకున్నారు. లోకేష్ - జూనియర్ ఎన్టీఆర్ కూడా విషయం తెలిసిన వెంటనే తన మేనత్త ఇంటికి చేరుకున్నారు. బాలయ్య కూడా చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దగ్గుబాటి పురంధేశ్వరి - దగ్గుబాటి వేంకటేశ్వరావు అక్కడకు చేరుకున్నారు. గుండెపోటు కారణంగా ఉమామహేశ్వరి తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తెకు వివాహం జరగగా.. ఆ సమయంలోనే చంద్రబాబు - దగ్గుబాటి వేంకటేశ్వరావు కలుసుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో కొంతకాలంగా ఉమామహేశ్వరి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ కి చిన్న కుమార్తె అయినటువంటి ఉమా మహేశ్వరి జాబ్లీహిల్స్ లోని నివాసంలో కన్నుమూశారు. ఇక ఉమా మహేశ్వరి మృతితో సినీప్రముఖులు, నందమూరి అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.