దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది నయనతార. ఒక్కో సినిమాలకు 3-5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ స్టార్ హీరోయిన్గా నిలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కెరాఫ్ అడ్రెస్గా నిలిచింది నయనతార. ఇక కొన్ని రోజుల క్రితమే ప్రియుడు విఘ్నేష్ శివన్తో ఏడడుగులు నడిచింది. హిందూ సంప్రదాయం ప్రకారం, అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరుకాగా.. ఇక ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్, షారుక్ఖాన్ వంటి ప్రముఖులు హాజరయ్యి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక వివాహం సందర్భంగా నయన్ దంపతులు తమిళనాడు వ్యాప్తంగా లక్ష మంది అనాథలు, వృద్ధులకు వివాహ భోజనం పెట్టి మంచి మనసు చాటుకున్నారు. ఇవన్ని పక్కకు పెడితే.. ప్రస్తుతం ఓ వార్త అందరిని ఆకర్షిస్తోంది. అందేంటంటే.. నయన్ వివాహానికి ఆమె తల్లి హాజరు కాలేదు. అదేంటి కన్నకూతురి వివాహానికి తల్లి ఎందుకు హాజరు కాకపోవడం ఏంటి అనుకుంటున్నారా.. అసలు ఏమైందో తెలియాలంటే ఇది చదవండి.. ఏడేళ్ల ప్రేమ, సహజీవనం తర్వాత.. నయనతార, విఘ్నేశ్ పెళ్లితో ఒక్కటయ్యారు. జూన 9న తమిళనాడులోని మహాబలిపురంలో షెరటాన్ గ్రాండ్ హోటల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి ప్రముఖులంతా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే నయన్ పెళ్లికి ఆమె తల్లి హాజరు కాలేదు. అనివార్య కారణాలవల్లే ఆమె వివాహానికి రాలేదని సమాచారం. దీంతో నయన్ భర్త విఘ్నేశ్తో కలిసి తల్లిని కలిసేందుకు కేరళకు వెళ్లింది. కేరళలోనే ఈ జంట కొన్నిరోజుల పాటు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: Shah Rukh: నయనతార పెళ్లికి వెళ్లిన షారుక్ ఖాన్ పై ట్రోలింగ్! ఎందుకంటే… సన్నిహితులు తెలిపిన సమాచారం ప్రకారం.. నయనతార, విఘ్నేష్ శివన్ మరో రెండు వారాల పాటు కేరళలో ఉంటారు. ఈ సమయంలో నయన్ దపంతులు వేర్వేరు ఆలయాలను సందర్శించనున్నుట్లు తెలుస్తోంది. పెళ్లికి తల్లి రాకపోవడంతో.. విఘ్నేశ్, నయన్ ఇద్దరు కలిసి ఆమెని కలిసేందుకు కేరళకు వెళ్లారు. దక్షిణ కేరళలోని ఆమె స్వగ్రామంలో నయనతార తల్లి ఒమన కురియన్ను కలిసేందుకు వెళ్తూ ఆదివారం మధ్యాహ్నం కొచ్చి చేరుకున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Nayanthara: రాష్ట్రంలోని అనాథాశ్రమాలన్నింటిలో అన్నదానం.. నయన్ విఘ్నేష్ గొప్ప మనసు ఇది కూడా చదవండి: Nayanthara: విగ్నేష్ శివన్ చెల్లెలికి భారీగా ఆడపడుచు కట్నం! నయన్ ఎంత ఇచ్చింది అంటే?