Meena: ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన హీరోయిన్ గా నటించిన మీనా.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తోంది. అయితే.. ఇటీవలే మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణంతో ఇండస్ట్రీలోని ప్రముఖులంతా సంతాపాన్ని వ్యక్తం చేశారు. అయితే.. ప్రస్తుతం మీనా తన భర్తను కోల్పోయిన బాధలో ఉండి కూడా ఇదివరకు తాను కమిటైన సినిమాలను పూర్తి చేసే పనిలో పడింది. తాజాగా ఓ సినిమా సెట్ లో నటుడు రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్నటువంటి మీనాను నటుడు ఆలీ భార్య జుబేదా కలిసి మాట్లాడి ఓ వీడియో రిలీజ్ చేసింది. అలాగే చిన్నప్పుడు మొదటిసారి మీనాని కలిసిన ఫోటోని చూపిస్తూ.. మీనాపై ఆమెకున్న అభిమానాన్ని చాటుకుంటూ విష్ చేసింది. ఇక మీనా షూటింగ్స్ లో పాల్గొంటుందని తెలిసేసరికి అభిమానులు కూడా మీనా త్వరగా ఆ బాధ నుండి బయటపడి, పనిలో పడినందుకు సంతోషిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మీనా తెలుగులో చివరిగా 'సన్ ఆఫ్ ఇండియా' మూవీలో కనిపించింది. ఇప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' అనే సినిమాలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే.. అలీ భార్య అప్లోడ్ చేసిన వీడియో 20 వ తేదీని సూచిస్తూ ఉండటంతో.. అంతా ఇది లేటెస్ట్ వీడియో అనే నమ్ముతున్నారు. రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు కూడా జులై 19 కావడంతో అంతా ఈ వీడియో తాజాదే అంటూ షేర్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.