మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సీతారామం'. ఆగష్టు 5న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకెళ్తోంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతీ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ గా నిలించింది. అద్భుత ప్రేమ కథను అంతే డైరెక్టర్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ అందరిని మెప్పించింది. పలువురు సినీ ప్రముఖులు సైతం మృణాల్ ను అభినందిచారు. తెలుగులో ఈ డెబ్యూ మూవీతో మృణాల్ వరుస ఆఫర్లు దక్కించుకోవడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా సినిమా గురించి ఓ క్రేజీ అప్ డేట్ ఒకటి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సీతారామం మూవికే హైలెట్ గా నిలిచిన సీతమహాలక్ష్మి పాత్ర కోసం హను రాఘవపూడి మొదట మృణాల్ ఠాకూర్ ను అనుకోలేదంట. సీత పాత్రలో పూజా హెగ్డే అయితేనే బాగుటుందని భావించి హను రాఘవపూడి ఆమెకు కథ చెప్పాడట. బుట్టబొమ్మకు కూడా ఈ కథ బాగా నచ్చింది. సినిమాలో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. అయితే అనూహ్యంగా కరోనా మహామ్మారి విజృభించడంతో వేరే సినిమాలకు ఇచ్చిన డేట్స్ వృధా కావడంతో సీతారామం మూవీకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయిదంట. దీంతో ఆ పాత్రలో మృణాల్ ఠాకూర్ ని దర్శకుడు ఎంపిక చేశారు. అనుకోకుండా వచ్చిన అవకాశంతో మృణాల్ ఠాకూర్.. సీత మహాలక్ష్మి పాత్రలో అదరగొట్టింది. తెలుగు డెబ్యూ మూవీతోనే మృణాలు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆగస్టు 5 న విడుదలైన సీతారామం చిత్రం మంచి వసూళ్లు సాధిస్తుండటమే కాకుండా ప్రేక్షకుల చేత , సినీ విమర్శకుల చేత కూడా నీరాజనాలు అందుకుంటోంది. అలా బుట్ట బొమ్మ పూజా హెగ్డే సూపర్ హిట్ ని మిస్ చేసుకుంది పాపం. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ప్రముఖ టీవీ షోపై హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్స్! ఇదీ చదవండి: పెళ్లిపీటలు ఎక్కనున్న హీరోయిన్ ...