Lakshmi Manchu: సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండే అతి కొద్ది మంది సినీ సెలెబ్రిటీలలో మంచు లక్ష్మి ఒకరు. తనకు, తన ఫ్యామిలికీ సంబంధించిన విషయాలను మంచు లక్ష్మి ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా, ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఓ ఫొటో అభిమానుల్లో అలజడిని సృష్టించింది. వారు ఆందోళన చెందుతుండటంతో ఆమె ఆ ఫొటోపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్దిరోజుల క్రితం మంచు లక్ష్మి తనకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. ఆ ఫొటోలో ఆమె చేతికి గాయం అయినట్లుగా ఉంది. ఆ ఫొటో చూసిన అభిమానులు ఏమైందంటూ ఆందోళనకు గురవ్వటం మొదలుపెట్టారు. కామెంట్లు చేస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అభిమానులు తన ఆరోగ్యం గురించి పడుతున్న తాపత్రయంతో మంచు లక్ష్మి ఆలోచనల్లో పడ్డారు. ఆ ఫొటో ఏంటి? తనకు ఏమైందన్న సంగతిని తెలియజేస్తూ తాజాగా మరో పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ఆమె స్పందిస్తూ.. ‘‘హాయ్ గాయ్స్.. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీరు నేను పెట్టిన స్టోరీపై స్పందిస్తూ సానుభూతి వ్యక్తం చేశారు. నేను ఆ ఫొటో ఏంటని క్లియర్గా చెప్పనందుకు సారీ. అది నేను నటిస్తున్న కొత్త చిత్రం.. ‘అగ్నినక్షత్రం’లోనిది. షూటింగ్కు సంబంధించినది’’ అని పేర్కొన్నారు. తనకు మేకప్ వేసిన ఆర్టిస్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరి, మంచు లక్ష్మి షూటింగ్ ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) ఇవి కూడా చదవండి : అమ్మని కావాలనుకున్నా.. నాలుగోసారీ విఫలం! కన్నీరు పెట్టుకున్న నటి!