Krithi Shetty: టాలీవుడ్ లో ఉప్పెన సినిమాతో కెరీర్ ప్రారంభించిన యంగ్ హీరోయిన్ కృతి శెట్టి. డెబ్యూ మూవీతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ.. ఒక్క సినిమాతోనే చేతినిండా అవకాశాలను దక్కించుకుంది. తెలుగు మాత్రమే కాకుండా తమిళంలో సైతం స్టార్ హీరోలతో సినిమాలను లైనప్ చేస్తోంది. అయితే.. ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం 'ది వారియర్'. జూలై 14న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో చిత్రబృందంతో కలిసి హీరోయిన్ కృతి కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అలాగే సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూలలో షేర్ చేసుకుంటోంది కృతి. తాజాగా సినిమా షూటింగ్ లో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చిన కృతి మాటలు.. సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో కృతి మాట్లాడుతూ.. 'నా మాతృభాష తుళు. తెలుగు బాగానే నేర్చుకున్నాను. అలాగే ఇప్పటివరకూ తెలుగు దర్శకులతోనే పనిచేశాను. కానీ.. వారియర్ డైరెక్టర్ లింగుస్వామి తమిళ దర్శకుడు. అందుకే ఆయన వద్ద షూటింగ్ లో భాషాపరంగా చాలా ఇబ్బంది పడ్డాను. నాకు తమిళం రాదు. అందులోనూ ఆయన మాట్లాడే తెలుగు.. తమిళ యాసలో ఉంటుంది. దీంతో ఏం చెప్పేవారో అర్థమయ్యేది కాదు. అలా మొదట్లో వారంపాటు లింగుస్వామి తెలుగుతో ఇబ్బందిపడ్డాను. ఆ తర్వాత హీరో రామ్ కి తమిళం వచ్చని తెలిసింది. అప్పటినుండి రామ్ సపోర్ట్ తీసుకుంటూ వచ్చాను. డైరెక్టర్ చెప్పేది నాకు రామ్ క్లియర్ గా వివరించేవాడు. ఆ విధంగా కొద్దిరోజులకు తమిళ భాషకు అలవాటు పడిపోయాను" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృతి శెట్టి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ది వారియర్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.