Kantamaneni Uma Maheswari: ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మరణం నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఆమె సోమవారం మధ్యాహ్నం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్యలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. సోమవారమే ఉమామహేశ్వరి పార్థివ దేహానికి పోస్టుమార్టం పూర్తయింది. తాజాగా, పోస్టుమార్టానికి సంబంధించిన నివేదిక వచ్చింది. ఉస్మానియా హాస్పిటల్ ఫోరెన్సిక్ వైద్యుల బృందం పోస్టుమార్టం నివేదికను శుక్రవారం సాయంత్రం జూబ్లీ హిల్స్ పోలీసులకు అందజేశారు. ఆ నివేదిక ప్రకారం.. ఉమామహేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉరి వేసుకోవటంతో ఆమె గొంతులోని స్వరపేటిక విరిగిపోయింది. కాగా, బుధవారం ఉమామహేశ్వరి అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు జూ.ఎన్టీఆర్ హాజరుకాలేకపోయారు. భార్యాపిల్లలతో విదేశాల్లో వెకేషన్లో ఉన్న కారణంగా సరైన సమయానికి ఇండియాకు రాలేకపోయారు. అయితే, గురువారం తల్లి, భార్యతో కలిసి మేనత్త నివాసానికి వెళ్లారు. అక్కడ మేనత్త కుటుంబాన్ని పరామర్శించారు. ఇవి కూడా చదవండి : Dhanush: సుమన్ కాళ్లు నొక్కమన్న డైరెక్టర్.. కుదరదని వెళ్లిపోయిన స్టార్ కమెడియన్!