Kantamaneni Uma Maheswari: ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మరణం నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఆమె సోమవారం మధ్యాహ్నం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్యలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఇప్పటికే ఉమామహేశ్వరి పార్థివ దేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఈ సందర్భంగా ఆమె నేత్రాలను దానం చేశారు. గతంలో ఉమామహేశ్వరి కోరిన కోరిక మేరకు ఆమె కుటుంబసభ్యులు కళ్లను దానం చేశారు. అంతేకాదు! ఉమామహేశ్వరి కుమార్తె అమెరికానుంచి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆమె రావటం ఆలస్యమవుతుందని భావించిన వైద్యులు భౌతిక దేహానికి ఎంబామింగ్ పక్రియను నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టును మరో రెండు రోజుల్లో అందిస్తామని ఉస్మానియా వైద్యులు తెలపారు. ఇక, తల్లి మృతిపై ఆమె కూతురు దక్షిత మాట్లాడుతూ.. ‘అనారోగ్య సమస్యలతో అమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య సమయంలో ఇంట్లో నలుగురమే ఉన్నాం. భోజన సమయానికి గదిలోంచి బయటకు రాకపోయే సరికి తలుపు తెరిచే ప్రయత్నం చేశాం. లోపలినుంచి బోల్ట్ పెట్టుకుని ఉంది’’ అని పేర్కొన్నారు. కుటుంబసభ్యులు అనుమానంతో తలుపు బద్దలు కొట్టి చూడగా ఉమామహేశ్వరి ఉరి వేసుకుని కనిపించారు. ఇవి కూడా చదవండి : NTR కూతురే అయినా.. ఉమా మహేశ్వరి జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో తెలుసా?