బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మాటతీరు గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమెకు ఏదనిపిస్తే అది కుండబద్దలు కొట్టినట్లు చెబుతూ వార్తల్లో నిలుస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజంపై, బాలీవుడ్ స్టార్ కిడ్స్ పై గతంలో కూడా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీలోని నెపోటిజంపై, అలాగే స్టార్ కిడ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా. ప్రస్తుతం కంగనా చేసిన వ్యాఖ్యలు అటు బాలీవుడ్ లో, ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం కంగనా 'ధాకడ్' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంగనా.. ఇప్పుడున్న పరిస్థితులలో స్టార్స్ పిల్లలు హీరోలు, హీరోయిన్లుగా సినిమాలు చేస్తే ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం కష్టమని చెప్పింది. “ఇక్కడ జరిగేది ఏంటంటే.. దక్షిణాది నటులు ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అవుతారు. వాళ్ళు ప్రేక్షకులను అన్నింటికంటే ఎక్కువగా భావిస్తారు. మరి బాలీవుడ్ స్టార్ కిడ్స్ సంగతి చూసుకుంటే.. విదేశాల్లో చదువుకుని వస్తారు. ఇంగ్లీష్ మాట్లాడుతూ హాలీవుడ్ సినిమాలను మాత్రమే చూస్తారు. చేత్తో కాకుండా ఫోర్క్ లు, కత్తులతో తినే అలవాటు వారిది. అలాగే వారు మాట్లాడే విధానం కూడా వెరైటీగా ఉంటుంది.ఇలాంటి వాళ్లు ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అవుతారు? అందుకే వీళ్లంతా ప్రేక్షకులకు ఉడకబెట్టిన కోడిగుడ్లలాగా విచిత్రంగా కనిపిస్తారు" అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంకా మాట్లాడుతూ.. 'పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఓ కూలీ పాత్రను పోషించాడు. ఆ పాత్రలో అతన్ని చూస్తే.. అందరికీ తెలిసినవాడిలా కనిపిస్తారు. అందుకే ప్రతి కార్మికుడు ఆ పాత్రతో కనెక్ట్ అయ్యారు. ఇప్పుడున్న బాలీవుడ్ హీరోల్లో ఎవరైనా కూలీగా కనిపించేందుకు ఇష్టపడతారా? అని ప్రశ్నించింది. సౌత్ సినిమాలు సంస్కృతిని, వాస్తవాలను ప్రతిబింబించేలా ఉంటున్నాయి. అందుకే ఆ సినిమాలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. నా ఉద్దేశం ఎవరినీ ట్రోల్ చేయాలని కాదు" అంటూ చెప్పుకొచ్చింది. మరి కంగనా మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.