జబర్దస్త్.. ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్లుగా, స్టార్ కమీడియన్స్ గా ఎదిగారు. చాలా మంది వెండితెరపై కూడా ఎన్నో అవకాశాలు దక్కించుకున్నారు. వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరని చెప్పొచ్చు. జబర్దస్త్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో మంచి అవకాశాలు దక్కించుకుంది. అనసూయకు అటు ఫ్యాన్ బేస్ కూడా ఎంతో పెరిగింది. అయితే గత కొంతకాలంగా జబర్దస్త్ నుంచి జడ్జులు, కమీడియన్లు వెళ్లిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా ఆ షో నుంచి తప్పుకోకున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఆమె స్థానంలో కొత్త యాంకర్గా ఎవరు వస్తారనే దానిపై బుల్లితెర వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే అనసూయ స్థానంలో యాంకర్ మంజూష రాంపల్లి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంజూష ఎంట్రీపై ఎలాంటి అధికారిక ప్రకటన/సమాచారం లేదు. ప్రస్తుతం ఓ వార్త బాగా ప్రచారంలో ఉంది. అదేంటంటే.. యాంకర్ శ్రీముఖి జబర్దస్త్ ఆఫర్ రిజెక్ట్ చేసింది అని. నిజానికి 2013లోనే యాంకర్ అనసూయ కంటే ముందే శ్రీముఖికి జబర్దస్త్ ఆఫర్ వచ్చింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) కానీ, ఆసమయంలోనే శ్రీముఖి రిజెక్ట్ చేసింది. ఆ తర్వాతే అనసూయ ఆ ఆఫర్ దక్కించుకుని ఇప్పుడు నేమ్, ఫేమ్, ప్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు కూడా మరోసారి జబర్దస్త్ నిర్వాహకులు శ్రీముఖిని సంప్రదించారని.. మరోసారి ఆమె వాళ్ల ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కానీ, ఆ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం శ్రీముఖి జబర్దస్త్ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు ప్రచారం జోరందుకుంది. శ్రీముఖి జబర్దస్త్ ఆఫర్ రిజెక్ట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Manjusha Rampalli (@anchor_manjusha)