Hyper Aadi: తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బుల్లితెర ఎంటర్టైన్ మెంట్ షోలలో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఒకటి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ షో.. దాదాపు 74 వారాలుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. అయితే.. మొదట్లో సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరించి కొన్నివారాల క్రితమే వెళ్లిపోయాడు. ఇక అప్పటినుండి శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా రష్మీ గౌతమ్ కొనసాగుతోంది. ఇక ఈ షోలో జడ్జిలుగా ఒక్కరే ఉంటారని చెప్పడం కష్టం. ఎందుకంటే.. వారానికో, రెండు వారాలకో కొత్త జడ్జిలు వస్తూ, పాతవాళ్ళు మారిపోతున్నారు. ప్రస్తుతానికి జడ్జిగా నటి పూర్ణ కనిపిస్తోంది. షోలో ఎంటర్టైన్ మెంట్ పరంగా జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, రామ్ ప్రసాద్, ఇమ్మానుయేల్, వర్ష ఇలా అందరూ వారి స్టైల్ లో కామెడీ పండిస్తున్నారు. అయితే. తాజాగా ఈ షో కొత్త ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో శ్రీదేవి డ్రామా కంపెనీ 75వ ఎపిసోడ్ కి చేరుకున్న సందర్భంగా స్పెషల్ పెర్ఫార్మన్స్ లు, డాన్సులు, స్కిట్లతో పాటు కొత్త గెస్టులను కూడా ఆహ్వానించారు. ఈ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ గా హీరోయిన్ ఇషా చావ్లా పాల్గొని సందడి చేసింది. ముఖ్యంగా హైపర్ ఆదితో ఇషా కెమిస్ట్రీ ప్రోమోలో హైలైట్ అవుతోంది. అదీగాక.. ఆది ఇషాకు ప్రపోజ్ చేయడమే కాకుండా 11 గిఫ్టులు కూడా ఇవ్వడం విశేషం. ఇదిలా ఉండగా.. ప్రోమో చివరిలో ఏమైందో గానీ.. స్టేజిపై అందరూ ఎమోషనల్ అయిపోయారు. హైపర్ ఆదితో పాటు జబర్దస్త్ వర్ష, ఇమ్మానుయేల్, సీరియల్ ఆర్టిస్టులు ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు. మరి వారెందుకు కంటతడి పెట్టుకున్నారనేది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ ప్రసారం వరకూ ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. మరి ఈ ఎమోషనల్ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.