రెబల్ స్టార్ కృష్ణంరాజు(జనవరి 20 1940 - 11 సెప్టెంబర్ 2022) ఇవాళ తెల్లవారు జామున 3 గంటల 25 నిమిషాలకి ఏఐజీ ఆసుపత్రిలో కన్ను మూసిన సంగతి తెలిసిందే. పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రెండు సార్లు కరోనా బారిన పడ్డ కృష్ణంరాజు.. ఆగస్ట్ 5న కోవిడ్ తర్వాత వచ్చే సమస్యలతో ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయనను నెల రోజులుగా వెంటిలేటర్ ఉంచి చికిత్స అందజేశామని వైద్యులు తెలిపారు. మూత్రపిండాల పనితీరు పూర్తిగా దెబ్బ తినడం, డయాబెటిస్, కార్డియాక్ అరెస్ట్ వంటి కారణాలతో కృష్ణంరాజు మృతి చెందినట్లు ఏఐజీ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. కృష్ణంరాజు మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ పెద నాన్నని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. అంతలా ప్రభాస్ ఏడవడానికి కారణం కృష్ణంరాజు ప్రభాస్ కి తండ్రి లేని లోటుని తీర్చడమే. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు చనిపోయినప్పుడు ఎంతలా విలవిలలాడిపోయారో.. ఇప్పుడు కృష్ణంరాజు చనిపోయినప్పుడు కూడా అంతకంటే ఎక్కువగా కంటతడి పెడుతున్నారు. ప్రతీ ఇంట్లోనూ పెదనాన్న/చిన్నాన్న, సోదరుడు కొడుకుల మధ్య చాలా సాన్నిహత్యం ఉంటుంది. తండ్రికి చెప్పుకోలేని విషయాలు కూడా తండ్రి సోదరుడితో షేర్ చేసుకుంటారు. ప్రభాస్, కృష్ణంరాజులా బాండింగ్ ని చూసే బలాదూర్ సినిమా తీశారేమో అనిపిస్తుంది. సినిమాల్లోకి రాకముందు ప్రభాస్ కూడా బలాదూర్. సత్ప్రవర్తన కలిగిన బలాదూర్ మనిషి. ఫ్రెండ్స్ తో తిరగడం, షికార్లు ఇలా ఉండేది. View this post on Instagram A post shared by U.V.Krishnam Raju (@uvkrishnamraju) అలాంటి ప్రభాస్ ని సినిమాల్లోకి తీసుకొచ్చింది, హీరోని చేసింది, ఇవాళ అంతర్జాతీయ హీరోగా నిలబెట్టింది రెబల్ స్టార్ కృష్ణంరాజే. కృష్ణంరాజుకి ముగ్గురూ కూతుర్లే అవ్వడం వల్ల.. తన తర్వాత తన కుటుంబం నుంచి ఒకరు హీరోగా రావాలని అనుకున్నారు. ఉప్పలవాటి వారి నట ప్రస్థానం తనతో ఆగిపోకూడదని పట్టుబట్టి మరీ ప్రభాస్ ని సినిమాల్లోకి తీసుకొచ్చారు. నిజానికి ప్రభాస్ కి సినిమాల్లోకి రావాలన్న ఆసక్తి లేదు. పైగా ప్రభాస్ కి సిగ్గు ఎక్కువ. కెమెరాని ఫేస్ చేయాలంటే మొహమాటం. అలాంటి ప్రభాస్ ని బలవంతంగా కెమెరా ముందు నిలబెట్టి.. తన నట వారసత్వాన్ని, రెబల్ స్టార్ అనే బిరుదుని ఇచ్చి డార్లింగ్ ని మన ముందు నిలబెట్టారు. కృష్ణంరాజుకి కొడుకు ఉన్నా కూడా ప్రభాస్ ని ఇదే విధంగా చూసేవారని ప్రభాస్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండడం అనే గొప్ప లక్షణం ప్రభాస్ కి కృష్ణంరాజు నుండి వచ్చిందే. ఆ లక్షణమే ఇవాళ ప్రభాస్ వెండితెర రారాజుగా, మనసున్న మారాజుగా మన ముందు నిలబెట్టింది. ఇదంతా కృష్ణంరాజు ట్రైనింగే. తన సొంత కొడుకులా ప్రభాస్ ని తీర్చిదిద్దారు. ప్రభాస్ ని తమ్ముడి కొడుకుగా కంటే కూడా కన్న కొడుకుగానే చూసుకున్నారు. అసలు పెదనాన్న అనే ప్రస్తావనే లేకుండా, నాన్నే అన్న భావన కలిగించారు. నాన్న లాంటోడు ఏంటి, నాన్నే అనే భావన ప్రభాస్ కి కలిగించారు. ఇద్దరి మధ్య తండ్రీ, కొడుకుల అనుబంధం ఉందని చెప్పడానికి ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. View this post on Instagram A post shared by U.V.Krishnam Raju (@uvkrishnamraju) కృష్ణంరాజుకి ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో, ప్రభాస్ కి కూడా కృష్ణంరాజు అన్నా కూడా అంతే ఇష్టం. ఇష్టం కంటే ఎక్కువ ప్రాణం. ప్రభాస్ కి తండ్రి లేని లోటుని కృష్ణం రాజు భర్తీ చేశారు. కానీ కృష్ణం రాజు లేని లోటుని మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు. మిమ్మల్ని కోల్పోయాం కృష్ణంరాజు గారు. మీకు సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాం. ఓం శాంతి!. కృష్ణంరాజు, ప్రభాస్ ల బాండింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది చదవండి: Krishnam Raju: కృష్ణంరాజుకి రెబల్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే? ఇది చదవండి: Prabhas: నిన్నే ఆసుపత్రిలో కృష్ణంరాజుని పరామర్శించిన ప్రభాస్! అంతలో ఏమి జరిగింది?